మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా ఆర్డిఓ

0
740

చీరాల మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ గా భాద్యతలు స్వీకరించిన రెవెన్యూ డివిజనల్ అధికారి,ఈ సందర్భముగా ఆర్డీవో చంద్రశేఖర్ మాట్లాడుతూ చీరాల మున్సిపాలిటీని ప్లాస్టిక్ వాడకం రహిత మున్సిపాలిటీగా చేయాలని గతములోనే తీర్మానించు కోవడం జరిగినదని,కానీ ఇది పూర్తిగా అమలు కావడం లేదని,దీని వలన భవిష్యత్ తరాలకు తీవ్రమైన హానికరముగా మారుతుందని,అనేక ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తుందని ప్రజలు,వ్యాపారులు ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని పూర్తిగా నిషేదించాలని కోరారు.

 

ప్రజా ప్రయోజనార్థం అందరు వ్యాపారులు వినియోగదారులకు తగు అవగాహన కల్పిస్తూ ప్రజలు కొనుగోలు చేయు వినియోగ వస్తువులు తీసుకెళ్లుటకు ప్రత్యామ్నాయ సంచులను విధిగా తెచ్చుకొనే విధముగా ప్రోత్సహించాలని, అందరు వ్యాపారులు ఎవ్వరూ కూడా తమ తమ షాపులలో ప్లాస్టిక్ సంచులను ఉంచుకొనరాదని, వినియోగదారులకు అమ్మరాదని మరియు ఇవ్వరాదని తెలిపారు.

 

చీరాల పురపాలక పరిధిలోని రోడ్లపై గోవులను వదలి వేస్తున్నారని దీనివలన ప్రజలు, విద్యార్థులు ప్రయాణ సమయాలలో తీవ్ర ప్రమాదాలకు గురౌతున్నారని, ఇలా రోడ్లపై గోవులు తిరగడం వలన అందరికీ ఇబ్బందులు కలుగు తున్నాయని, ఇది గుర్తెరిగి గోవుల యజమానులు వాటిని వారి వారి ఇంటి ఆవరణల లోనే వుంచుకొని పోషించు కోవాలని రోడ్ల పైకి వదల రాదని తెలిపారు. అతిక్రమించిన వారిపై ప్రభుత్వ నిభంధనల మేరకు చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
శ్రీశైలం మల్లికార్జున ఉత్సవాలకు నారా లోకేష్ కు ఆహ్వానం
*శ్రీశైలం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు మంత్రి నారా లోకేష్ కు ఆహ్వానం*   ఉండవల్లి:...
By Rajini Kumari 2026-02-07 11:54:47 0 132
Telangana
నిజామాబాద్: ఏప్రిల్ 2వతారికు వైన్సులు బ్యాండ్
జిల్లాలో 2వతరికున వైంసులు బంద్కనునాయి. హముమాన్‌జయంతి నేపత్యం లో శాంతిభద్రతాల దృష్టియా జిల్లా...
By Sadaq Sadaq 2026-03-31 17:28:11 0 137
Andhra Pradesh
ప్రజల్లో భక్తి భావం పెంపొందించాలి రాజంపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షుడు
ఈరోజు తంబళ్లపల్లె నియోజకవర్గం కోసువారిపల్లిలో తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున నిర్వహిస్తున్న...
By Benguluri Madhubabu 2026-01-25 04:34:39 0 228
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com