మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా ఆర్డిఓ

0
821

చీరాల మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ గా భాద్యతలు స్వీకరించిన రెవెన్యూ డివిజనల్ అధికారి,ఈ సందర్భముగా ఆర్డీవో చంద్రశేఖర్ మాట్లాడుతూ చీరాల మున్సిపాలిటీని ప్లాస్టిక్ వాడకం రహిత మున్సిపాలిటీగా చేయాలని గతములోనే తీర్మానించు కోవడం జరిగినదని,కానీ ఇది పూర్తిగా అమలు కావడం లేదని,దీని వలన భవిష్యత్ తరాలకు తీవ్రమైన హానికరముగా మారుతుందని,అనేక ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తుందని ప్రజలు,వ్యాపారులు ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని పూర్తిగా నిషేదించాలని కోరారు.

 

ప్రజా ప్రయోజనార్థం అందరు వ్యాపారులు వినియోగదారులకు తగు అవగాహన కల్పిస్తూ ప్రజలు కొనుగోలు చేయు వినియోగ వస్తువులు తీసుకెళ్లుటకు ప్రత్యామ్నాయ సంచులను విధిగా తెచ్చుకొనే విధముగా ప్రోత్సహించాలని, అందరు వ్యాపారులు ఎవ్వరూ కూడా తమ తమ షాపులలో ప్లాస్టిక్ సంచులను ఉంచుకొనరాదని, వినియోగదారులకు అమ్మరాదని మరియు ఇవ్వరాదని తెలిపారు.

 

చీరాల పురపాలక పరిధిలోని రోడ్లపై గోవులను వదలి వేస్తున్నారని దీనివలన ప్రజలు, విద్యార్థులు ప్రయాణ సమయాలలో తీవ్ర ప్రమాదాలకు గురౌతున్నారని, ఇలా రోడ్లపై గోవులు తిరగడం వలన అందరికీ ఇబ్బందులు కలుగు తున్నాయని, ఇది గుర్తెరిగి గోవుల యజమానులు వాటిని వారి వారి ఇంటి ఆవరణల లోనే వుంచుకొని పోషించు కోవాలని రోడ్ల పైకి వదల రాదని తెలిపారు. అతిక్రమించిన వారిపై ప్రభుత్వ నిభంధనల మేరకు చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లె: ఇంటి వివాదంలో వ్యక్తిపై కర్రలతో దాడి.
మదనపల్లె పట్టణంలోని రాజారెడ్డి కాలనీలో మంగళవారం సాయంత్రం ఇంటి ఖాళీ విషయంపై తలెత్తిన వివాదం...
By Pagadala Venkateswar 2026-02-11 05:52:06 0 150
Telangana
బహుజనులకు కూడా రాజ్యాధికారం ఉండాలని పోరాడి సాధించిన ధీరుడు సర్దార్ పాపన్న గౌడ్: ఎమ్మెల్యే శ్రీ గణేష్
    మల్కాజిగిరి:బోయిన్ పల్లి.   సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి...
By Sidhu Maroju 2025-08-18 15:48:45 0 642
Andhra Pradesh
అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి : మున్సిపల్ కమిషనర్
కర్నూలు సిటీ :  అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి• నగరపాలక సంస్థ కమిషనర్...
By Hari Krishna 2026-01-20 12:18:00 0 180
Andhra Pradesh
దివ్యాంగ శక్తి పథకమును ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
ఈరోజు రాయచోటి బస్టాండ్ నందు దివ్యాంగ శక్తి పథకమును లాంఛనంగా ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి...
By Benguluri Madhubabu 2026-03-18 09:57:58 0 220
Andhra Pradesh
మైనార్టీ ఆస్తులపై కన్నేసిన కూటమి ప్రభుత్వం నేతలు.
అంజుమన్ కి సబదించినినా ఈ భూమి ఎన్నో దశాబ్దాలుగా మైనారిటీ సంక్షేమ కార్యక్రమాలకు, విద్యా-సామాజిక...
By John Baji 2025-12-23 11:24:50 0 244
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com