బహుజనులకు కూడా రాజ్యాధికారం ఉండాలని పోరాడి సాధించిన ధీరుడు సర్దార్ పాపన్న గౌడ్: ఎమ్మెల్యే శ్రీ గణేష్

0
540

 

 

మల్కాజిగిరి:బోయిన్ పల్లి.   సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి కార్యక్రమం ఈరోజు బోయిన్ పల్లి గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ జయంతి కార్యక్రమానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ముఖ్యఅతిథిగా హాజరై పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బహుజనులకు కూడా రాజ్యాధికారం ఉండాలని పోరాడి సాధించిన గొప్ప పోరాట యోధుడని,మహారాష్ట్ర ప్రాంతంలో చత్రపతి శివాజీ, దక్షిణాదిలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మొగలులపై దండెత్తి రాజ్యాధికారాన్ని సాధించారని, గోల్కొండ కోటపై జెండా ఎగురవేసిన ధీరోదాత్తుడని,350 ఏళ్ల క్రితమే బహుజనుల కోసం పోరాడిన మహనీయుడని, జమిందారులు, భూస్వాములపై పోరాటం చేసి, సామాన్యులకు సంపద పంచిన వీరుడని,ఒక సామాన్య వ్యక్తి ఎలాంటి ఉన్నత శిఖరాలకు అయినా చేరుకోవచ్చని నిరూపించిన పోరాటయోధుడని, వారిని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని చెప్పారు.ఈ జయంతి కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులతో పాటు కంటోన్మెంట్ బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ జంపన ప్రతాప్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ముప్పిడి మధుకర్,మారుతి గౌడ్, బల్వంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.  

      -sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
తాడేపల్లి హెచ్ఎఫ్ కన్వెన్షన్ హాల్‌లో డా. ఉండవల్లి శ్రీదేవి గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ.
తాడేపల్లి హెచ్ఎఫ్ కన్వెన్షన్ హాల్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాదిగ కార్పొరేషన్...
By John Baji 2026-02-04 15:02:53 0 62
Andhra Pradesh
GST RTGS ప పట్టాదారు పాసుపుస్తకాలపై మంత్రులు అధికారులతో సమీక్ష సీఎం చంద్రబాబు
    *అమరావతి*   *జీఎస్డీపీ, ఆర్టీజీఎస్, పట్టాదారు పాస్ పుస్తకాలపై మంత్రులు,...
By Rajini Kumari 2026-01-12 13:11:43 0 72
Andhra Pradesh
PGRS ద్వారా మాజీ సైనిక కుటుంబానికి భూ సమస్య పరిష్కారం
PGRS ద్వారా మాజీ సైనిక కుటుంబానికి భూ సమస్య పరిష్కారం బాపట్ల: బాపట్ల జిల్లా వేటపాలెం మండలం...
By Gadiyapudi Narendra 2025-12-30 10:59:58 0 168
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com