గంగ అవెన్యూ వాసుల గోస.. రంగంలోకి దిగిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి!

0
178

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : గంగ అవెన్యూ మరియు దాని చుట్టుపక్కల కాలనీల నివాసితుల విజ్ఞప్తి మేరకు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు బుధవారం ప్రభుత్వ అధికారులతో కలిసి ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. 

గంగ అవెన్యూ, ఎంఈఎస్ కాలనీ, కాశీపురం, శ్రీనివాసిక కాలనీల్లో నెలకొన్న నీటి నిల్వ మరియు డ్రైనేజీ సమస్యలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా స్థానిక కాలనీ సంక్షేమ సంఘాల (RWA) ప్రతినిధులు తమ బాధలను మైనంపల్లి దృష్టికి తీసుకెళ్లారు.

కాలనీల్లో సరైన వర్షపు నీటి కాలువలు (Storm Water Drains), బాక్స్ డ్రైన్లు లేకపోవడం వల్ల వర్షం పడితే లోతట్టు ప్రాంతాలు, ముఖ్యంగా గంగ అవెన్యూలోని క్వారీ గుంతలు జలమయమవుతున్నాయని వివరించారు. పెండింగ్‌లో ఉన్న డ్రైనేజీ పైప్‌లైన్ పనులను వెంటనే పూర్తి చేయాలని వారు కోరారు.

సమస్య తీవ్రతను గమనించిన మైనంపల్లి హనుమంతరావు అక్కడి నుండే ఎంఎంసీ కమిషనర్ విజయ కృష్ణారెడ్డి (IAS), మల్కాజిగిరి జడ్సీ సంచిత్ గంగ్వార్ (IAS)లతో ఫోన్లో మాట్లాడారు. 

పెండింగ్ పనులకు సంబంధించి తక్షణమే అనుమతులు మంజూరు చేసి, సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

ఈ పర్యటనలో వాటర్ బోర్డ్ జీఎం సునీల్, డిసి భోగేశ్వర్లు, జీహెచ్‌ఎంసీ ఈఈ వెంకటేశ్వర్లు, ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి, డీఈ ప్రశాంత్, డీజీఎం సాంబయ్య తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

కాలనీ ప్రతినిధులు జోసెఫ్ రెడ్డి, రెహ్మాన్,  అంజనేయులు, మరియు కాంగ్రెస్ నేతలు సురేందర్ రెడ్డి, శ్రీశైలం యాదవ్, లడ్డు రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.

#sidhumaroju

Alwal

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
అన్నమయ్య: దొంగతనానికి వచ్చి.. కెమెరాలకు చిక్కారు.
శనివారం రాత్రి రాజంపేట మండలం వెంకట రాజంపేటలోని కనకదుర్గమ్మ గుడిలో ఇద్దరు దొంగలు హుండీని బద్దలు...
By Pagadala Venkateswar 2026-05-25 04:20:46 0 5
Andhra Pradesh
చెడును త్వజించి మంచిని ఆహ్వానించడమే భోగి అంతరార్థం
*చెడును త్యజించి, మంచిని స్వీకరించడమే భోగి అంతరార్థం. ఈ భోగి మీ ఇంట సిరిసంపదలు కురిపించాలని...
By Rajini Kumari 2026-01-14 12:29:11 0 133
Telangana
శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని నిజాంపేట్ మున్సిపల్...
By Sidhu Maroju 2025-11-28 16:11:15 0 183
Andhra Pradesh
కలెక్టర్ ఆఫీస్ ముందు రోడ్డు లో అడ్డంగా. వేరు శెనగ వ్యా పారం
దేశంలోనే విశాఖ నగరాన్ని అతి సుందరి క రణంగా తీర్చి దిద్ద లని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు...
By Mobbu Venkatramana 2026-01-23 05:06:24 0 608
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com