చందిప్ప గ్రామ రైతుకు ఉత్తమ రైతు అవార్డు

0
407

శంకర్పల్లి మండల పరిధిలోని చందిప్ప గ్రామానికి చెందిన ప్రగతిశీల రైతు దోసాడ శేఖర్ రెడ్డి గారికి ప్రతిష్టాత్మకమైన సెంట్రల్ సిల్క్ బోర్డు ఉత్తమ రైతు అవార్డు లభించింది. రంగారెడ్డి జిల్లా పరిధిలో ఎంపికైన ముగ్గురు రైతుల్లో ఒకరుగా నిలిచిన శేఖర్ రెడ్డి గారు జిల్లాకు గర్వకారణంగా నిలిచారు.

గత తొమ్మిది సంవత్సరాలుగా పట్టు పురుగుల పెంపకం (సెరికల్చర్) రంగంలో నిరంతర కృషి చేస్తూ, సొంతంగా చాకి నిర్వహిస్తూ మంచి దిగుబడులు సాధిస్తూ ఆదర్శ రైతుగా నిలుస్తున్నారు. ఆధునిక పద్ధతులను అనుసరిస్తూ, నాణ్యమైన మల్బరి ఆకులను ఉత్పత్తి చేసి పట్టు పురుగుల పెంపకంలో ఉన్నత ఫలితాలు సాధిస్తున్నారు. ఈ కృషి ద్వారా స్థిరమైన ఆదాయం పొందడమే కాకుండా, ఇతర రైతులకు మార్గదర్శకుడిగా నిలుస్తున్నారు.

శేఖర్ రెడ్డి గారి కృషిని గుర్తించిన సెంట్రల్ సిల్క్ బోర్డు సభ్యులు డా. వినోద్ కుమార్, డా. రాఘవేందర్‌లు ఈ అవార్డును అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించి, భవిష్యత్తులో మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.

అంతేకాకుండా, పరిగి, కొండంగల్, వికారాబాద్ ప్రాంతాల నుండి కొత్తగా పట్టు పురుగుల పెంపకం ప్రారంభించిన రైతులకు శేఖర్ రెడ్డి గారు మల్బరి సాగు, పురుగుల సంరక్షణ, వ్యాధి నివారణ వంటి అంశాలపై విలువైన సూచనలు, సలహాలు అందిస్తున్నారు. ఆయన అనుభవం కొత్త రైతులకు ఎంతో ఉపయోగపడుతోంది.

ఈ సందర్భంగా శేఖర్ రెడ్డి మాట్లాడుతూ, ఈ అవార్డు రావడం తనకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. రైతులకు, ముఖ్యంగా యువతకు ఇది ప్రేరణగా నిలవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉద్యోగాల కోసం మాత్రమే కాకుండా, స్వయం ఉపాధి రంగంలో కూడా అనేక అవకాశాలు ఉన్నాయని, ముఖ్యంగా పట్టు పురుగుల పెంపకం వంటి రంగాలలో మంచి ఆదాయం సాధించవచ్చని సూచించారు. మన మండలంలో చేనేతకు సంబంధించిన యువకులు, రైతులు ఈ రంగాన్ని నేర్చుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

చివరిగా, ఈ విజయాన్ని సాధించడంలో ఏడి ముత్యాలు గారు మరియు నాగరత్నం మేడం అందించిన సహకారం ఎంతో కీలకమని శేఖర్ రెడ్డి గారు తెలిపారు.

Like
1
Search
Categories
Read More
Telangana
ఇంజెక్షన్‌తోనే పిల్లలు పుడతారట.. నమ్మి వెళ్లిన ఆ దంపతులు.. చివరకు..
హైదరాబాద్‌లో సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న...
By Ponnala Srinivasrao 2026-06-24 01:37:44 0 127
Telangana
"భద్రతపై అల్వాల్ పోలీసుల చైతన్యం: ఏఆర్కే అపార్ట్‌మెంట్స్‌లో ‘మీ సురక్ష’ కార్యక్రమం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజ్‌గిరి జోన్ పరిధిలోని అల్వాల్ ఏఆర్కే అపార్ట్‌మెంట్స్...
By Sidhu Maroju 2026-05-25 03:40:41 0 214
Telangana
ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండా గుండె వాల్వ్ చికిత్స.|
      సికింద్రాబాద్ : వృద్ధాప్యంలో గుండె ఆపరేషన్ అంటే ప్రమాదమనే భయాన్ని...
By Sidhu Maroju 2026-02-11 15:09:12 0 218
Andhra Pradesh
నందిగామలో అవినీతి అక్రమాలపై వైసీపీ ఆగ్రహం
నందిగామలో అవినీతి, అక్రమాలపై వైసీపీ ఆగ్రహం టీడీపీ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే డా. మొండితోక...
By Patan Khuddus 2026-07-06 16:53:56 0 96
Andhra Pradesh
జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించిన జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు.
బాపట్ల: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించిన...
By Gadiyapudi Narendra 2026-01-19 14:51:05 0 208
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com