నందిగామలో అవినీతి అక్రమాలపై వైసీపీ ఆగ్రహం

0
89

నందిగామలో అవినీతి, అక్రమాలపై వైసీపీ ఆగ్రహం

టీడీపీ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే డా. మొండితోక జగన్‌మోహన్‌రావు విమర్శలు

నందిగామ, జూలై 6 భారత్ అవాజ్ :

నందిగామలో టీడీపీ నాయకులు అవినీతి, దోపిడీలకు పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే డా. మొండితోక జగన్‌మోహన్‌రావు ఆరోపించారు. పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.ఎంపీడీవోను డబ్బులు డిమాండ్ చేశారంటూ పత్రికల్లో వచ్చిన కథనాలను ప్రస్తావించినందుకు వైసీపీ నాయకులపై కేసులు నమోదు చేయడం అన్యాయమని, తప్పు జరిగితే సంబంధిత వారిపైనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.అక్రమ ఇసుక, గ్రావెల్, మైనింగ్, రేషన్ బియ్యం దందాలు, మున్సిపాలిటీ, పంచాయతీల్లో అవినీతి పెరిగిందని ఆరోపించారు. నందిగామ అభివృద్ధిని పక్కనపెట్టి అవినీతికే ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు.ఈ సమావేశంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి మద్దుకూరి సాయి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
నా బిడ్డను చంపేశారనే అనుమానం – ఎస్పీకి బాధితురాలి ఫిర్యాదు.
మదనపల్లి జిల్లాలో పూలదివాకర్ (31) అనే యువకుడు అదృశ్యంపై అతని తల్లి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార...
By Pagadala Venkateswar 2026-02-16 14:40:18 0 181
Andhra Pradesh
ఈ నెల 22న విజయవాడలో క్రిస్మస్ వేడుకలకు సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు
*ఈ నెల 22న విజయవాడలో క్రిస్మస్ హైటీ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం నిర్వహించనుంది. దీనికి ముఖ్య...
By Rajini Kumari 2025-12-17 09:08:02 0 228
Andhra Pradesh
పుంగనూరు RTC బస్టాండ్‌కు ఆర్యవైశ్య సంఘం వాటర్ కూలర్ విరాళం కొత్తూరు మురళి
పుంగనూరు RTC బస్టాండ్‌లో ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కె. బాలసుబ్రమణ్యం,...
By Kothuru Murali 2026-05-27 14:46:05 0 67
Telangana
మద్దూర్ ఎస్సై పైన లైంగిక వేధింపుల ఆరోపణ కేసు నమోదు 
     సూర్యమోహన్    మద్దూర్ మండలం రిపోర్టర్    మద్దూర్...
By Vanmoj Suryamohan 2026-05-19 14:07:35 0 184
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం:కందూరు గ్రామంలో ఘనంగా గంగజాతర: భక్తుల కోలాహలం
అన్నమయ్య జిల్లా సోమల మండలం కందూరు గ్రామంలో ఆదివారం, సోమవారం (15, 16 తేదీలలో) అంగరంగ వైభవంగా...
By Kothuru Murali 2026-03-16 06:53:48 0 151
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com