జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించిన జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు.

0
82
బాపట్ల: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించిన జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు.
తమ సమస్యలను విన్నవించుకున్న 36 మంది అర్జీదారులు
అర్జీలు పునరావృతం కాకుండా సంతృప్తికర రీతిలో పరిష్కరించాలి
జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు
అర్జీలు పునరావృతం కాకుండా సంతృప్తికర రీతిలో పరిష్కరించాలని జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ గారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. వరకట్న వేధింపులు, కుటుంబ సమస్యలు, భూ వివాదాలు, ఆర్థిక లావాదేవీలు తదితర పలు సమస్యలతో మొత్తం 36 మంది అర్జీదారులు తమ సమస్యలను విన్నవించుకున్నారు.
జిల్లా ఎస్పీ గారు అర్జీదారుల సమస్యలను కూలంకషంగా విని, వారి అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి, నిర్దిష్ట గడువులోగా ఫిర్యాదిదారుల సమస్యలను పరిష్కరించాలని సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చే అర్జీలు పునరావృతం కాకుండా చట్ట పరిధిలో విచారించి సంతృప్తికర రీతిలో పరిష్కరించాలని పోలీస్ అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో సీసీఎస్ డీఎస్పీ పి. జగదీష్ నాయక్, పీజీఆర్ఎస్ సెల్ ఇన్‌స్పెక్టర్ పి. ప్రభాకర్‌తో పాటు ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
 
#Narendra
Search
Categories
Read More
Andhra Pradesh
విద్యార్థుల్లో వ్యక్తిత్వ వికాసం పెంపొందించాలి !!
కర్నూలు :  కర్నూలు సిటీ :  ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు అన్-ఎయిడెడ్ స్కూల్స్...
By Hari Krishna 2025-12-28 08:46:52 0 101
Bharat Aawaz
ఉత్తరాఖండ్‌లో ఆకస్మిక మేఘాల వర్షం – పలు గ్రామాల్లో వరదలు, ప్రాణనష్టం
ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉత్తర్‌కాశీ జిల్లాలో ఆగస్టు 6 ఉదయం ఆకస్మికంగా మేఘాల వర్షం...
By Bharat Aawaz 2025-08-06 05:15:02 0 688
Andhra Pradesh
న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల ఉక్కు పాదం విజయవాడలో కఠిన ఆంక్షలు
న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల ఉక్కుపాదం.. విజయవాడలో కఠిన ఆంక్షలు   నగరంలోని అన్ని ఫ్లైఓవర్లను...
By Rajini Kumari 2025-12-29 08:38:01 0 67
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com