జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించిన జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు.

0
203
బాపట్ల: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించిన జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు.
తమ సమస్యలను విన్నవించుకున్న 36 మంది అర్జీదారులు
అర్జీలు పునరావృతం కాకుండా సంతృప్తికర రీతిలో పరిష్కరించాలి
జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు
అర్జీలు పునరావృతం కాకుండా సంతృప్తికర రీతిలో పరిష్కరించాలని జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ గారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. వరకట్న వేధింపులు, కుటుంబ సమస్యలు, భూ వివాదాలు, ఆర్థిక లావాదేవీలు తదితర పలు సమస్యలతో మొత్తం 36 మంది అర్జీదారులు తమ సమస్యలను విన్నవించుకున్నారు.
జిల్లా ఎస్పీ గారు అర్జీదారుల సమస్యలను కూలంకషంగా విని, వారి అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి, నిర్దిష్ట గడువులోగా ఫిర్యాదిదారుల సమస్యలను పరిష్కరించాలని సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చే అర్జీలు పునరావృతం కాకుండా చట్ట పరిధిలో విచారించి సంతృప్తికర రీతిలో పరిష్కరించాలని పోలీస్ అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో సీసీఎస్ డీఎస్పీ పి. జగదీష్ నాయక్, పీజీఆర్ఎస్ సెల్ ఇన్‌స్పెక్టర్ పి. ప్రభాకర్‌తో పాటు ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
 
#Narendra
Search
Categories
Read More
Telangana
అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ కాంగ్రేస్ కార్యకర్తకి స్థానిక ఎమ్మెల్యే పరామర్శించారు కసిరెడ్డి నారాయణరెడ్డి
ఈరోజు రంగా రెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చౌదర్ పల్లి గ్రామ వాస్తవ్యులు సీనియర్ కాంగ్రెస్ పార్టీ...
By MERIGE MALLESH 2026-04-01 12:55:48 0 1K
Andhra Pradesh
చిన్నారులు వేద సహస్ర సుకృతిలకు వేద ఆశీస్సులు అందజేసిన సుగవాసి ప్రసాద్ బాబు
ఈరోజు రాయచోటి పట్టణం మాసాపేట రెడ్డి వారి పల్లెలో చిన్నారులు వేద సహస్ర సుకృతిలకు కేశఖండన...
By Benguluri Madhubabu 2026-02-26 11:13:25 0 228
Andhra Pradesh
కోటి రూపాయలు నిధులతో నూతన కమ్యూనిటీ హాల్ ప్రారంభించిన ఎంపీ ఎమ్మెల్యే
కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గం   మోపిదేవి మండలంలో పర్యటించిన ఎంపీ వల్లభనేని బాలశౌరి,...
By Rajini Kumari 2026-05-07 08:22:59 0 122
Andhra Pradesh
Tirumala: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ... ఒకటి, రెండు గంటల్లోనే శీఘ్ర దర్శనం.
టెన్త్, ఇంటర్ పరీక్షల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. స్వామి వారి దర్శనానికి గంటల తరబడి...
By Pagadala Venkateswar 2026-02-04 07:37:14 0 304
Andhra Pradesh
మాజీ సైనికుల ఆధ్వర్యంలో అలాయ్ బలాయ్ కార్యక్రమం
సైనికులు సర్వ మతాలను గౌరవించుకునే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ, కుల మతాలకు రాజకీయ పార్టీలకు అతీతంగా...
By Vadlamudi NagaVenkat 2026-03-21 05:42:26 0 616
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com