TTD: శ్రీవారి సేవలో ధర్మవరం పట్టు.. చేనేతలకు టీటీడీ భారీ ఆర్డర్.

0
170

శ్రీసత్యసాయి జిల్లాలోని ధర్మవరం చేనేత కార్మికులకు మంచి రోజులొచ్చాయి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల శ్రీవారి సేవలో ఇకపై ధర్మవరం పట్టు వస్త్రాలు భాగం కానున్నాయి. శ్రీవారి ఆర్జిత సేవల్లో పాల్గొనే వారికి అందించే పట్టు శాలువాలను ఇకపై ధర్మవరం నుంచే కొనుగోలు చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు తొలి విడతగా 65 వేల పట్టు శాలువాల కొనుగోలుకు టీటీడీ అనుమతులు మంజూరు చేసిందని మంత్రి సవిత వెల్లడించారు.

 

ధర్మవరంలో మెగా హ్యాండ్లూమ్‌ క్లస్టర్‌పై నిర్వహించిన అవగాహన సదస్సులో మంత్రి ఈ శుభవార్తను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మరో మంత్రి సత్యకుమార్, చేనేత, జౌళి శాఖ కమిషనర్ రేఖారాణి, కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్, టీడీపీ ధర్మవరం ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్ పాల్గొన్నారు. ఈ శాలువాల సరఫరా కోసం ధర్మవరంలో ప్రత్యేకంగా ఆప్కో కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి సవిత తెలిపారు. దీని ద్వారా నేరుగా చేనేతల నుంచి వస్త్రాలను కొనుగోలు చేసి టీటీడీకి అందిస్తామని వివరించారు.

 

ఈ సందర్భంగా ధర్మవరం చేనేత కార్మికులు తయారు చేసిన నమూనా పట్టు శాలువాను మంత్రులు సవిత, సత్యకుమార్ ఆవిష్కరించారు. టీటీడీ నిర్ణయంతో ధర్మవరం ప్రాంతంలోని వేలాది చేనేత కుటుంబాలకు ఉపాధి లభించనుండటంతో కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Search
Categories
Read More
Telangana
ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు...
భారత్ అవాజ్ న్యూస్:: హైదరాబాద్ తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫీజు గడువును మే 4 వరకు...
By Gujile Ramu 2026-05-02 12:09:25 0 277
Andhra Pradesh
మదనపల్లె: రిటైర్డ్ టీచర్ మెడలో బంగారు గొలుసు చోరీ.
మదనపల్లె పట్టణంలో మంగళవారం రాత్రి గొలుసు దొంగలు రెచ్చిపోయారు. కలెక్టరేట్ సమీపంలోని మోర్ సూపర్...
By Pagadala Venkateswar 2026-01-28 10:02:51 0 151
Andhra Pradesh
పుంగనూరు: అక్కడ చేరాలంటే ఈనెల 21 లోపు దరఖాస్తు చేసుకోండి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో రెండు సంవత్సరాల కోర్సులో చేరాలనుకునే...
By Kothuru Murali 2026-05-07 12:05:52 0 105
Andhra Pradesh
అమెరికా క్షిపణి దాడిలో మెరైన్ ఇంజినీర్ పట్నాల సురేష్‌ మృతి... చంద్రబాబు తీవ్ర విచారం.
ఒమన్ తీరంలో ఆయిల్ ట్యాంకర్‌పై క్షిపణి దాడి దాడిలో విశాఖకు చెందిన చీఫ్ ఇంజినీర్ సురేష్ మృతి...
By Pagadala Venkateswar 2026-06-12 11:11:36 0 90
Telangana
విద్యా వ్యవస్థ విఫలమవుతుంది, పిల్లల భవిష్యత్తు ప్రమాదంలో! — రెష్మా మొహమ్మద్
ఇది ఒక న్యూస్ కాదు — మౌనం ప్రమాదకరం అయినప్పుడు, ఒక తరం భవిష్యత్తుపై వేసిన మొదటి ప్రశ్న....
By Reshma Mohammed 2025-12-25 17:16:04 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com