రైతన్న సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం - ఎమ్మెల్యే నరేంద్ర వర్మ

0
724

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘రైతన్నా మీకోసం వారోత్సవాలు’ కార్యక్రమంలో భాగంగా నేడు బాపట్ల మండలం జమ్మలపాలెం గ్రామంలో బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు పర్యటించారు.ఇంటింటికీ వెళ్ళి రైతులతో ముఖాముఖి చర్చించి, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు.  

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ,పీఎం కిసాన్ పథకాల ద్వారా ప్రతి రైతుకు సంవత్సరానికి రూ. 20,000 ఆర్థిక సాయం అందజేస్తుందని గత ప్రభుత్వం కేవలం రూ. 7,500 ఇస్తే, మన ప్రభుత్వం రాష్ట్ర వాటాగా రూ. 14,000 ఇస్తూ రైతులకు అండగా నిలుస్తుందని అన్నారు.ఎమ్మెల్యే స్వయంగా రైతు ఇళ్లను సందర్శించి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాసిన ఆత్మీయ లేఖను,పథకాల వివరాలతో కూడిన బ్రోచర్లను అందజేశారు. రైతుల ఖాతాల్లోకి జమ అయిన రూ. 6,000 (అన్నదాత సుఖీభవ 3వ విడత) నిధుల గురించి ఆరా తీశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
బొబ్బిలిలో ఈనెల 31న మెగా జాబ్ మేళా
బొబ్బిలిలో గల స్థానిక శ్రీ సాయి (SS) డిగ్రీ కాలేజీలో ఈనెల 31న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు...
By Boiena Rajesh 2026-03-29 04:15:42 0 100
Andhra Pradesh
మదనపల్లె: పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలి - ASP.
అన్నమయ్య జిల్లా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) వెంకటాద్రి, మదనపల్లె సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్...
By Pagadala Venkateswar 2026-03-04 11:41:22 0 82
Andhra Pradesh
పోలీస్ కానిస్టేబుళ్ల శిక్షణ ప్రారంభం !!
కర్నూలు : పోలీస్ శాఖ లో క్రమశిక్షణ నే ప్రధానం : కర్నూలు రేంజ్ డిఐజి కోయ ప్రవీణ్ : ...
By Hari Krishna 2025-12-23 02:16:31 0 173
Telangana
విద్యార్థుల్లో చైతన్యం కోసం రామగుండం పోలీసుల చైల్డ్ సేఫ్టీ, యాంటీ డ్రగ్స్ కార్యక్రమాలు
విద్యార్థుల్లో చైతన్యం కోసం రామగుండం పోలీసుల చైల్డ్ సేఫ్టీ, యాంటీ డ్రగ్స్ కార్యక్రమాలు  ...
By Pinnehasan Odela 2026-03-06 14:06:20 0 132
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com