Chandrababu Naidu: ఏపీలో గ్యాస్ కొరత లేదు, ప్రజలు ఆందోళన చెందవద్దు: సీఎం చంద్రబాబు.

0
154

ఇరాన్ యుద్ధం నేపథ్యంలో, రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ నిల్వలు, సరఫరాపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. గ్యాస్ కొరతపై ఊహాగానాలు వస్తుండడం పట్ల ఆయన అధికారులతో చర్చించారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14 వేల టన్నుల ఎల్పీజీ గ్యాస్ నిల్వలు ఉన్నాయని, మరో 15 రోజులకు సరిపడా గ్యాస్ అందుబాటులో ఉందని సీఎం వెల్లడించారు.

 

అమరావతిలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో పెట్రోలియం కంపెనీల ప్రతినిధులు, గెయిల్, ఓఎన్జీసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆసుపత్రులు, హాస్టళ్లు, ఆలయాలకు గ్యాస్ కొరత రాకుండా నిరంతరాయంగా సరఫరా చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. కేవైసీ, ఓటీపీల ద్వారా సిలిండర్ల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

 

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, యుద్ధ పరిస్థితుల వల్ల అంతర్జాతీయంగా గ్యాస్ సరఫరాపై ప్రభావం పడుతున్నప్పటికీ, రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందని చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఇండక్షన్ స్టవ్‌ల ఉత్పత్తి, పంపిణీని పెంచి వాటి లభ్యతను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. అదే సమయంలో, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ను విస్తరించి, కేజీ బేసిన్ గ్యాస్‌ను పైప్‌లైన్ ద్వారా ఇళ్లకు సరఫరా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో గృహ వినియోగానికి గ్యాస్ కొరత లేదని, సరఫరా సజావుగా సాగుతోందని ఆయన పునరుద్ఘాటించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లి: టిప్పు సుల్తాన్ మైదాన అభివృద్ధి పనుల పరిశీలన.
మదనపల్లె పట్టణంలోని టిప్పు సుల్తాన్ మైదానంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే షాజహాన్ భాషా...
By Pagadala Venkateswar 2026-05-14 14:33:48 0 144
Telangana
గోరక్షకుడు ప్రశాంత్ సింగ్ పై దాడికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలి |
సికింద్రాబాద్ : మేడిపల్లి యంనం పేట్ వద్ద కాల్పులలో గాయపడి యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న...
By Sidhu Maroju 2025-10-23 15:27:56 0 283
Telangana
కరీంనగర్ బస్టాండ్ లో ప్రయాణికుల నిరీక్షణ
రాష్ట్ర వ్యాప్త ఆర్టీసీ సమ్మె ప్రభావంతో కరీంనగర్ బస్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. బస్సులు...
By Sunka Santhosh 2026-04-24 14:43:24 0 196
Telangana
మహబూబ్‌నగర్‌ డీటీసీ కిషన్‌ అరెస్ట్
ఆదాయానికి మించిన ఆస్తుల కేసు   ₹ 200 కోట్ల విలువైన అక్రమాస్తులు గుర్తించిన ఏసీబీ!  ...
By Ellandula Sandeep 2025-12-24 11:18:31 0 637
Business & Finance
India–China Direct Flights to Resume After Five-Year Gap
INDIA -CHINA-After a long gap of nearly five years, direct passenger flights between India and...
By Bharat Aawaz 2025-08-12 13:43:18 0 939
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com