Chandrababu Naidu: ఏపీలో గ్యాస్ కొరత లేదు, ప్రజలు ఆందోళన చెందవద్దు: సీఎం చంద్రబాబు.

0
89

ఇరాన్ యుద్ధం నేపథ్యంలో, రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ నిల్వలు, సరఫరాపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. గ్యాస్ కొరతపై ఊహాగానాలు వస్తుండడం పట్ల ఆయన అధికారులతో చర్చించారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14 వేల టన్నుల ఎల్పీజీ గ్యాస్ నిల్వలు ఉన్నాయని, మరో 15 రోజులకు సరిపడా గ్యాస్ అందుబాటులో ఉందని సీఎం వెల్లడించారు.

 

అమరావతిలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో పెట్రోలియం కంపెనీల ప్రతినిధులు, గెయిల్, ఓఎన్జీసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆసుపత్రులు, హాస్టళ్లు, ఆలయాలకు గ్యాస్ కొరత రాకుండా నిరంతరాయంగా సరఫరా చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. కేవైసీ, ఓటీపీల ద్వారా సిలిండర్ల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

 

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, యుద్ధ పరిస్థితుల వల్ల అంతర్జాతీయంగా గ్యాస్ సరఫరాపై ప్రభావం పడుతున్నప్పటికీ, రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందని చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఇండక్షన్ స్టవ్‌ల ఉత్పత్తి, పంపిణీని పెంచి వాటి లభ్యతను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. అదే సమయంలో, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ను విస్తరించి, కేజీ బేసిన్ గ్యాస్‌ను పైప్‌లైన్ ద్వారా ఇళ్లకు సరఫరా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో గృహ వినియోగానికి గ్యాస్ కొరత లేదని, సరఫరా సజావుగా సాగుతోందని ఆయన పునరుద్ఘాటించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
కె.నాగలాపురం గ్రామంలో 26 తేదీన యాక్సిడెంట్
కర్నూలు జిల్లా కె.నాగలాపురం గ్రామంలో 26 తేదీన యాక్సిడెంట్ ఇండియన్ పెట్రోల్ బంక్ దగ్గర జరిగిన...
By mahaboob basha 2025-08-31 00:49:50 0 433
Tamilnadu
Tamil Nadu TN SSC, HSE +1 (Class 11th) Result 2025 declared, girls outperform boys
Tamil Nadu TN SSC, HSE +1 (Class 11th) Result 2025 have been New Delhi: The Tamil Nadu...
By BMA ADMIN 2025-05-19 19:08:16 0 2K
Andhra Pradesh
రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం
రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వం ధ్యేయమని ఎమ్మెల్యే బేబినాయన అన్నారు. బొబ్బిలి మండలం సీతయ్య పేటలో...
By Boiena Rajesh 2026-03-18 08:22:36 0 154
Andhra Pradesh
రైల్వే జోన్ గెజిటెడ్ విడుదల కాక రాష్ట్రం నష్టపోతోంది బి శెట్టి
*రైల్వే జోన్ గెజిట్ విడుదలకాక రాష్ట్రం నష్టపోతోంది.భీశెట్టి* _కేంద్రరైల్వే మంత్రికి లేఖరాసిన లోక్...
By Rajini Kumari 2025-12-16 08:27:12 0 133
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com