Chandrababu: ఇఫ్తార్ విందులో ఇచ్చిన హామీని గంటల వ్యవధిలోనే నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు.

0
125

ఏపీ సీఎం చంద్రబాబు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఇమామ్‌లు, మౌజన్‌లకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. నిన్న‌ విజయవాడలో జరిగిన ఇఫ్తార్ విందులో ప్రకటించిన విధంగా వారి గౌరవ వేతనం బకాయిల కోసం రూ.45 కోట్లను ప్రభుత్వం ఇవాళ విడుదల చేసింది. ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే నిధులు విడుదల కావడం విశేషం. ఈ నిధులతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 10,000 మంది ఇమామ్‌లు, మౌజన్‌ల ఖాతాల్లోకి గత ఆరు నెలల బకాయిలను నేరుగా జమ చేయనున్నారు.

 

ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇమామ్‌లకు నెలకు రూ.10,000, మౌజన్‌లకు రూ.5,000 చొప్పున గౌరవ వేతనం అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా విడుదల చేసిన రూ.45 కోట్లు.. 2025 అక్టోబరు నుంచి 2026 మార్చి వరకు ఆరు నెలల కాలానికి సంబంధించినవి. రాష్ట్రంలోని 5,000 మసీదులలో సేవలందిస్తున్న వారికి ఈ బకాయిలను ఒకేసారి క్లియర్ చేశారు. తమ ప్రభుత్వం ముస్లింల సంక్షేమానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

 

ఇఫ్తార్ విందులో మాట్లాడిన సీఎం, ముస్లిం మైనారిటీల అభివృద్ధికి పలు హామీలు ఇచ్చారు. అమరావతిలో కొత్తగా హజ్‌ హౌస్‌ నిర్మాణం చేపడతామని ప్రకటించారు. అలాగే, కడపలో అసంపూర్తిగా ఉన్న హజ్‌ హౌస్‌ను త్వరలోనే పూర్తిచేసి అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత 21 నెలల్లో ముస్లింల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందని గుర్తుచేశారు. ఇప్పటివరకు ఇమామ్‌లు, మౌజన్లకు గౌరవ వేతనం కింద రూ.180 కోట్లు అందించామని వివరించారు.

 

రాష్ట్రంలో అర్హులైన ఇమామ్‌లను ప్రభుత్వ ఖాజీలుగా నియమించడంతో పాటు వివాహ లైసెన్స్‌ గడువును 3 సంవత్సరాల నుంచి 10 ఏళ్లకు పెంచామని చంద్రబాబు తెలిపారు. సుమారు 1,500 వక్ఫ్‌ ఆస్తులను సర్వే చేసి వాటిని కాపాడుతున్నామని చెప్పారు. ముస్లింలను ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి పథంలో నడిపించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
BR Naidu: హిందువుల ప్రాణాలు తీసేందుకే లడ్డూల్లో విష రసాయనాలు.. వైసీపీ మహాపాపం చేసింది: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు.
BR Naidu: హిందువుల ప్రాణాలు తీసేందుకే లడ్డూల్లో విష రసాయనాలు.. వైసీపీ మహాపాపం చేసింది: టీటీడీ...
By Pagadala Venkateswar 2026-01-31 06:19:42 0 125
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం కొత్తూరు మురళి: అగ్నిప్రమాదంలో 140 చెట్లు దగ్ధం
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలో గురువారం ఖలీల్ సాహెబ్ కు చెందిన రెండు ఎకరాల మామిడి తోటలో...
By Kothuru Murali 2026-02-20 08:20:52 0 112
Andhra Pradesh
రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు
రాష్ట్ర వ్యాప్తంగా రానున్న రెండు రోజులు కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర...
By Kanva Prasad 2025-05-28 16:39:08 0 3K
Andhra Pradesh
నేడు విజయవాడ క్యాంప కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి మండిపల్లి
ఈరోజు రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విజయవాడ క్యాంపు కార్యాలయంలో ప్రజా...
By Benguluri Madhubabu 2026-01-27 12:40:18 0 221
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com