Chandrababu: ఇఫ్తార్ విందులో ఇచ్చిన హామీని గంటల వ్యవధిలోనే నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు.

0
124

ఏపీ సీఎం చంద్రబాబు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఇమామ్‌లు, మౌజన్‌లకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. నిన్న‌ విజయవాడలో జరిగిన ఇఫ్తార్ విందులో ప్రకటించిన విధంగా వారి గౌరవ వేతనం బకాయిల కోసం రూ.45 కోట్లను ప్రభుత్వం ఇవాళ విడుదల చేసింది. ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే నిధులు విడుదల కావడం విశేషం. ఈ నిధులతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 10,000 మంది ఇమామ్‌లు, మౌజన్‌ల ఖాతాల్లోకి గత ఆరు నెలల బకాయిలను నేరుగా జమ చేయనున్నారు.

 

ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇమామ్‌లకు నెలకు రూ.10,000, మౌజన్‌లకు రూ.5,000 చొప్పున గౌరవ వేతనం అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా విడుదల చేసిన రూ.45 కోట్లు.. 2025 అక్టోబరు నుంచి 2026 మార్చి వరకు ఆరు నెలల కాలానికి సంబంధించినవి. రాష్ట్రంలోని 5,000 మసీదులలో సేవలందిస్తున్న వారికి ఈ బకాయిలను ఒకేసారి క్లియర్ చేశారు. తమ ప్రభుత్వం ముస్లింల సంక్షేమానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

 

ఇఫ్తార్ విందులో మాట్లాడిన సీఎం, ముస్లిం మైనారిటీల అభివృద్ధికి పలు హామీలు ఇచ్చారు. అమరావతిలో కొత్తగా హజ్‌ హౌస్‌ నిర్మాణం చేపడతామని ప్రకటించారు. అలాగే, కడపలో అసంపూర్తిగా ఉన్న హజ్‌ హౌస్‌ను త్వరలోనే పూర్తిచేసి అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత 21 నెలల్లో ముస్లింల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందని గుర్తుచేశారు. ఇప్పటివరకు ఇమామ్‌లు, మౌజన్లకు గౌరవ వేతనం కింద రూ.180 కోట్లు అందించామని వివరించారు.

 

రాష్ట్రంలో అర్హులైన ఇమామ్‌లను ప్రభుత్వ ఖాజీలుగా నియమించడంతో పాటు వివాహ లైసెన్స్‌ గడువును 3 సంవత్సరాల నుంచి 10 ఏళ్లకు పెంచామని చంద్రబాబు తెలిపారు. సుమారు 1,500 వక్ఫ్‌ ఆస్తులను సర్వే చేసి వాటిని కాపాడుతున్నామని చెప్పారు. ముస్లింలను ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి పథంలో నడిపించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
విద్యార్థుల కలలకు రెక్కలు
కలలకు రెక్కలు: నందిగామ టాపర్లకు విమానంలో హైదరాబాద్ ప్రయాణం విద్యా ప్రతిభను గౌరవించిన తంగిరాల...
By Patan Khuddus 2026-05-05 08:22:27 0 200
Telangana
అల్లనేరేడు చెట్టు ఎక్కి ప్రాణాలు కోల్పోయిన యువకుడు.
అల్లనేరేడు చెట్టు ఎక్కి ప్రాణాలు కోల్పోయిన యువకుడు.అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కనాజీగూడ లో...
By BMA ADMIN 2025-05-26 09:12:54 0 2K
Andhra Pradesh
In wins third t20 World Cup
కడప : టీ-20 వరల్డ్ కప్ ఫైనల్స్లో న్యూజిలాండ్ జట్టుపై భారత జట్టు విజయం సాధించడంతో జిల్లా...
By Naveen Kumar 2026-03-09 04:27:14 0 210
Telangana
"బాలుడు ఆసిఖ్ మిస్సింగ్ : వివరాలు వెల్లడించిన ఎస్.హెచ్.ఓ. నోముల వెంకటేష్!
సికింద్రాబాద్ : వెస్ట్ మారేడుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బాలుడు అదృశ్యమైనట్లు పోలీసులు కేసు...
By Sidhu Maroju 2026-04-23 08:01:22 0 158
Telangana
వైదిక బ్రాహ్మణ సంఘం నిర్మాణం కోసం స్థలాన్ని కేటాయించండి : ఎమ్మెల్యే వినతి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :    డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో తెలంగాణ...
By Sidhu Maroju 2025-12-16 13:20:51 0 212
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com