“మల్లారెడ్డి కాలనీలో ట్రాఫిక్ పరిష్కారానికి చర్యలు – ప్రత్యామ్నాయ రోడ్‌పై చర్చ”

0
182

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్లారెడ్డి కాలనీలో తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలపై స్థానిక నివాసితులు చేసిన ఫిర్యాదుల మేరకు మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. 

ఈ సందర్భంగా టౌన్ ప్లానింగ్ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి తో కలిసి ఆమె కాలనీలో పర్యటించి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు.

పర్యటన సమయంలో కాలనీ వాసులు భారీ వాహన రాకపోకల వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.

ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.

ప్రత్యేకంగా, చంద్రపురం కాలనీ ద్వారా వెళ్లే ప్రత్యామ్నాయ రహదారిని శుభ్రపరచి అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. 

ఈ మార్గం అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ ఒత్తిడి తగ్గి వాహనాల రాకపోకలు సాఫీగా సాగుతాయని స్థానికులు అభిప్రాయపడ్డారు.

నివాసితుల ఇబ్బందులను త్వరలోనే పరిష్కరిస్తానని శాంతి శ్రీనివాస్ రెడ్డి  కాలనీవాసులకు హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

#sidhumaroju

Alwal 

Search
Categories
Read More
Telangana
కాళేశ్వరం విజయాన్ని క్లెయిమ్ చేసుకుంటున్న బీఆర్ఎస్ - కాంగ్రెస్ ఆరోపణల్ని నిరూపించలేకపోయిందా?
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు ఇచ్చిన తీర్పు బీఆర్ఎస్‌ను సంతోషపరిచింది....
By Ponnala Srinivasrao 2026-04-23 03:54:36 0 74
Andhra Pradesh
అది సూక్ష్యమైన అంబేద్కర్ విగ్రహాన్ని తయారు చేయించిన జనసేన నాయకురాలు ఫాతిమారాణి
విజయవాడ    అతి సూక్ష్మమైన అంబేడ్కర్ బంగారు విగ్రహాన్ని తయారు చేయించిన గోపాలపురం జనసేన...
By Rajini Kumari 2026-05-15 12:15:46 0 71
Telangana
రోడ్ల పై జాగ్రత్త వహించండి... ఆర్. వి. కె
నిన్న వైరా సమీపంలో జరిగిన యాక్సిడెంట్ ఘటన పై శత తారక ఆర్గనైజేషన్ అధ్యక్షులు ఆర్. వి. కె సానుభూతి...
By Krishna Balina 2026-01-17 10:12:30 0 189
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com