విధులకు గైర్హాజరు.. 51 మంది వైద్యులపై ఏపీ సర్కార్ వేటు.

0
91

ఏపీలో 51 మంది ప్రభుత్వ వైద్యులను శాశ్వతంగా తొలగించిన ప్రభుత్వం

ఏళ్ల తరబడి విధులకు అనధికారికంగా గైర్హాజరు కావడమే కారణం

తొలగించిన వారిలో 8 మంది అసోసియేట్, 41 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు

మరో 33 మంది వైద్యులకు ఛార్జ్ మెమోలు జారీ చేశామన్న మంత్రి సత్యకుమార్

బాధ్యతారాహిత్యం సహించేది లేదని వెల్లడి

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏళ్ల తరబడి విధులకు అనధికారికంగా గైర్హాజరవుతున్న 51 మంది వైద్యులను సర్వీస్ నుంచి శాశ్వతంగా తొలగించింది. ఈ విషయాన్ని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రోగులకు మెరుగైన సేవలు అందించే క్రమంలో ప్రభుత్వం ఈ కఠిన చర్యలు చేపట్టిందని ఆయన స్పష్టం చేశారు.

 

డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిధిలోని వివిధ ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో పనిచేస్తున్న వారిపై ఈ చర్యలు తీసుకున్నారు. తొలగించిన వారిలో 8 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 41 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇద్దరు ట్యూటర్లు ఉన్నారు. వీరిలో కొందరు ఆరు నుంచి ఏడు సంవత్సరాలుగా విధులకు రాకుండా, ప్రైవేటు పనుల్లో ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ (ప్రవర్తనా నియమాలు)-1964 ప్రకారం షోకాజ్ నోటీసులు జారీ చేసినప్పటికీ, వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

 

వీరితో పాటు, ఏడాదిలోపు గైర్హాజరైన మరో 33 మంది వైద్యులకు ఛార్జ్ మెమోలు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు. వీరిలో 11 మంది ఇప్పటికే తిరిగి విధుల్లో చేరారని, మిగిలిన వారు నిర్దేశిత గడువులోగా హాజరుకాకపోతే వారిని కూడా తొలగిస్తామని హెచ్చరించారు. "విధి నిర్వహణలో బాధ్యతారాహిత్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించే ప్రసక్తే లేదు" అని మంత్రి సత్య కుమార్ స్పష్టం చేశారు.

Search
Categories
Read More
Telangana
పెద్దపల్లి : సాయంత్రం ఈదురుగాలితో వర్షం
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఈదురు గాలులు ఉరుములతో కూడిన అకాల వర్షం కురిసింది. దీంతో జన జీవనం...
By Sunka Santhosh 2026-05-26 17:42:56 0 96
Andhra Pradesh
ఈరోజు రాయచోటిలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్
ఈరోజు రాయచోటి మండలం మంత్రి స్వగ్రామ్ అయినటువంటి బోరెడ్డి గారి పల్లి లో ప్రజా దర్బార్ నిర్వహించారు...
By Benguluri Madhubabu 2026-02-02 06:43:13 0 262
Andhra Pradesh
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు - నేటి నుంచి అమల్లోకి..! ముఖ్యమైన వివరాలు
ఏపీ ప్రభుత్వం కొత్తగా రెండు జిల్లాలు ఏర్పాటు చేయడంతో మొత్తం జిల్లాల సంఖ్య 28కి చేరుకుంది. ఈ కొత్త...
By John Baji 2025-12-31 05:57:02 0 194
Andhra Pradesh
Tirumala: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.
    Tirumala: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ 30-03-2026 Mon 19:15 | Both States...
By Pagadala Venkateswar 2026-03-31 03:44:37 0 263
Andhra Pradesh
పుంగనూరు: పుంగునూరు పట్టణం లో వెలసిన సుగుటూరు గంగమ్మ జాతరకు రెండో చాటింపు ఇదే
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో ఈ నెల 10, 11 తేదీలలో సుగుటూరు గంగమ్మ జాతర జరగనుంది. ఈ...
By Kothuru Murali 2026-03-07 06:54:48 0 163
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com