పెన్షన్లు, ఇళ్లు ఎక్కడ? కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు.|

0
193

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ లోని  జిహెచ్ఎంసి అధికారులు పనితీరును మెరుగుపరుచుకోవాలని ప్రజలకు నాణ్యమైన సేవలను అందించి వారి మన్నలను పొందాలని జిహెచ్ఎంసి కార్యాలయం ముందు బిజెపి నాయకులు దండా నిర్వహించారు.  అనంతరం అల్వాల్ లోని సమస్యలపై డిప్యూటీ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. 

 ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..  రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ నాయకులు తీవ్రంగా విమర్శించారు. 

అధికారంలోకి వచ్చి నెలలు గడిచినా యువతకు జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, వృద్ధాప్య–వితంతు–దివ్యాంగులకు ఆసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, పేదలకు గృహ నిర్మాణ పథకం, రైతులకు రైతు భరోసా వంటి కీలక హామీలు ఇంకా అమలు కాలేదని వారు పేర్కొన్నారు.

ప్రభుత్వంపై నమ్మకం పెట్టుకుని ఓటు వేసిన ప్రజలు ఇప్పుడు తీవ్ర నిరాశకు గురవుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోలేకపోయిందని బీజేపీ నాయకులు అన్నారు.

ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు ఆసరా పెన్షన్ల కోసం నెలలుగా ఎదురుచూస్తున్నా ఇప్పటికీ మంజూరు కాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి వెంటనే పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

అలాగే పేదల కోసం ప్రకటించిన గృహ నిర్మాణ పథకం కూడా ఇప్పటికీ అమలు కాకపోవడంతో అనేక కుటుంబాలు ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నాయని తెలిపారు. అర్హులైన పేదలకు తక్షణమే ఇళ్లను మంజూరు చేయాలని కోరారు.

ఇక జీహెచ్ఎంసీ అల్వాల్ సర్కిల్ పరిధిలో పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాలు, వీధి దీపాల సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు.

ప్రజల సమస్యలను ప్రభుత్వం ఇలాగే నిర్లక్ష్యం చేస్తే బీజేపీ ప్రజాస్వామ్య పద్ధతుల్లో తన పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తుందని నాయకులు హెచ్చరించారు.

అల్వాల్ సర్కిల్ పరిధిలో ఉన్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయాలని వారు గట్టిగా డిమాండ్ చేశారు.

#sidhumaroju

Alwal 

Search
Categories
Read More
Andhra Pradesh
విజయవాడ రైల్వే మౌలిక వసతులు అభివృద్ధిపై MP కేశినేని శివనాద్కృషి
*ప్ర‌చుర‌ణార్థం* *18-12-2025*   విజయవాడ రైల్వే మౌలిక వసతుల అభివృద్ధిపై ఎంపీ...
By Rajini Kumari 2025-12-18 11:47:52 0 215
Telangana
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో విపత్తు నిర్వహణ ముందస్తు చర్యలు: సర్వసన్నద్ధంగా ఉండాలని కలెక్టర్ కె. హరిత, ఎస్పీ నితికా పంత్ ఆదేశం
🎤కొమురం భీం ఆసిఫాబాద్  భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్ కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా...
By Chunarkar Jagadeesh 2026-06-05 16:43:41 0 220
Andhra Pradesh
పుంగనూరు: ద్విచక్ర వాహన ర్యాలీ
భద్రత వారోత్సవాల్లో భాగంగా పుంగనూరు పట్టణంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుప్రియ ఆధ్వర్యంలో...
By Kothuru Murali 2026-01-13 09:19:10 0 182
Telangana
మేము గోల్ కొట్టడం ఖాయం...హరీష్ రావు
మేము గోల్ కొట్టడం ఖాయం ‎ ‎బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయం ‎కేసీఆర్ సీఎం అవ్వడం...
By Ponnala Srinivasrao 2026-03-25 11:00:53 0 202
Lakshdweep
Lakshadweep Boosts Women’s Livelihood and Empowerment
Lakshadweep continues to strengthen women’s empowerment through livelihood promotion, skill...
By Fathima Safa 2026-06-29 07:56:51 0 108
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com