అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే కొండయ్య*

0
520

తెలుగు ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు, ప్రత్యేక రాష్ట్రం కోసం తమ ప్రాణాలను అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా, చీరాల పట్టణం నందు కామధేను కాంప్లెక్స్ దగ్గర ఆయన విగ్రహానికి శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగు ప్రజలందరికీ ప్రత్యేక రాష్ట్రం ఉండాలనే ఏకైక ధృఢ నిశ్చయంతో పొట్టి శ్రీరాములు సుదీర్ఘ పోరాటం చేశారని కొనియాడారు. "పొట్టి శ్రీరాములు తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా చేసిన త్యాగం మనందరిలో దేశభక్తిని, నిస్వార్థ సేవను నింపాలని,ఆయన కేవలం ఆంధ్ర రాష్ట్రం కోసం మాత్రమే పోరాడలేదని,దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు తన ఆత్మార్పణతోనే నాంది పలికారన్నారు. భారతదేశ చరిత్రలోనే ఒక భాషా సమూహం కోసం ప్రాణత్యాగం చేసిన మొట్టమొదటి వ్యక్తిని శ్రీరాములు దీక్ష మరియు త్యాగ ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి, తెలుగు మాట్లాడే ప్రజల కోసం మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చిందని గుర్తు చేశారు. ఈ చారిత్రక ఘట్టం దేశంలోని ఇతర భాషా సమూహాలకూ స్ఫూర్తినిచ్చి, భాషా ప్రాతిపదికన రాష్ట్రాల పునర్విభజనకు దారి తీసిందని ఆయన పేర్కొన్నారు. తెలుగు భాష, సంస్కృతి, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడటానికి వారి ఆశయాలకు అనుగుణంగా,మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు.

Search
Categories
Read More
Andhra Pradesh
అయ్యప్ప స్వామి వారిని పెద్దిరెడ్డి రామ చంద్రా రెడ్డి గారు
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం, కోటమలై కొండపై వెలసిన శ్రీ అయ్యప్ప స్వామిని గురువారం మాజీ...
By Kothuru Murali 2026-01-02 05:24:26 0 148
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గంలో పోలీసులు సమాధానం
స్వచ్ఛ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యంగా పనిచేద్దామని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు. 'స్వర్ణాంధ్ర స్వచ్ఛ...
By Kothuru Murali 2026-02-22 11:03:25 0 108
Telangana
అవినీతికి తావు లేకుండా సుపరిపాలన కోసం పనిచేయాలి... జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్ జిల్లా నూతన ట్రైనీ గ్రూప్ వన్ అధికారులకు పిలుపునిచ్చారు.కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో...
By Gangaram Rangagowni 2026-02-17 09:59:25 0 343
Telangana
హైదరాబాద్ లో మంత్రులు. ఆర్టీసీ జేఏసీ మధ్య చర్చలు...
*హైదరాబాద్ లో మంత్రులు, ఆర్టీసీ జేఎసి మధ్య చర్చలు* సఫలం కావడం జరిగింది..  అన్ని సంఘాల...
By Gujile Ramu 2026-04-25 15:32:04 0 126
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com