అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే కొండయ్య*

0
522

తెలుగు ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు, ప్రత్యేక రాష్ట్రం కోసం తమ ప్రాణాలను అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా, చీరాల పట్టణం నందు కామధేను కాంప్లెక్స్ దగ్గర ఆయన విగ్రహానికి శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగు ప్రజలందరికీ ప్రత్యేక రాష్ట్రం ఉండాలనే ఏకైక ధృఢ నిశ్చయంతో పొట్టి శ్రీరాములు సుదీర్ఘ పోరాటం చేశారని కొనియాడారు. "పొట్టి శ్రీరాములు తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా చేసిన త్యాగం మనందరిలో దేశభక్తిని, నిస్వార్థ సేవను నింపాలని,ఆయన కేవలం ఆంధ్ర రాష్ట్రం కోసం మాత్రమే పోరాడలేదని,దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు తన ఆత్మార్పణతోనే నాంది పలికారన్నారు. భారతదేశ చరిత్రలోనే ఒక భాషా సమూహం కోసం ప్రాణత్యాగం చేసిన మొట్టమొదటి వ్యక్తిని శ్రీరాములు దీక్ష మరియు త్యాగ ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి, తెలుగు మాట్లాడే ప్రజల కోసం మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చిందని గుర్తు చేశారు. ఈ చారిత్రక ఘట్టం దేశంలోని ఇతర భాషా సమూహాలకూ స్ఫూర్తినిచ్చి, భాషా ప్రాతిపదికన రాష్ట్రాల పునర్విభజనకు దారి తీసిందని ఆయన పేర్కొన్నారు. తెలుగు భాష, సంస్కృతి, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడటానికి వారి ఆశయాలకు అనుగుణంగా,మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు.

Search
Categories
Read More
Andhra Pradesh
తిరుపతి జీల్లాలో గూడూరు ఔట్, రైల్వే కోడూరు ఇన్
జిల్లాల పునర్విభజన పై సిఎం చంద్రబాబు నాయుడు చర్చించి నట్లు తెలుస్తోంది.ఈసమావేశంలో మంత్రులు...
By Karapati Gopi 2025-12-27 14:53:57 0 432
Andhra Pradesh
రాష్ట్ర స్థాయి మాజీ సైనికుల సమావేశానికి ఎమ్మెల్యే వేగేశన ను ఆహ్వానిస్తున్న రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర
ఏప్రిల్ 19 వ తేదీన బాపట్ల లోని అన్నం సతీష్ ప్రభాకర్ కాపు కల్యాణ మండపంలో రాష్ట్ర స్థాయిలో మాజీ...
By Vadlamudi NagaVenkat 2026-04-11 09:33:01 0 131
Andhra Pradesh
Andhra Pradesh Rains: ఏపీకి వర్ష సూచన.. దక్షిణ కోస్తాలో వడగళ్ల వాన హెచ్చరిక!.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ...
By Pagadala Venkateswar 2026-03-20 09:43:15 0 153
Andhra Pradesh
Pawan Kalyan: కేజీహెచ్ సిబ్బంది నిర్లక్ష్యంతో బిడ్డను కోల్పోయానన్న మహిళ... స్పందించిన పవన్ కల్యాణ్.
Andhra Pawan Kalyan Responds to Womans Loss of Baby Due to KGH Negligence కేజీహెచ్ వైద్యుల...
By Pagadala Venkateswar 2026-01-31 10:26:59 0 129
Andhra Pradesh
వేట్లపాలెం పేలుడు బాధితులకు అండగా న్యూ మెన్ చారిటబుల్ సొసైటీ
వేట్లపాలెం బాణాసంచా ప్రమాదంలో గూడపర్తి మాదిగపేటకు చెందిన ఏడుగురు మృతి చెందడం ప్రాంతాన్ని విషాదంలో...
By Ratna Sekhar 2026-02-28 19:39:46 0 902
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com