ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారికి బంగారు మంగళసూత్రాలు విరాళం బహుమతి అందజేత

0
199

ప్రకటన

 ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారికి బంగారు సూత్రాలు విరాళం

 

ఇంద్రకీలాద్రిపై వెలసిన జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ మరియు శ్రీ మల్లేశ్వర స్వామి వారలకు భక్తులు తమ భక్తిని చాటుకున్నారు. చింతలపూడి, మండవల్లి మండలం ఏలూరు జిల్లా చెందిన మేడపాటి వెంకట నాగిరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు శ్రీ అమ్మవారి అలంకరణ నిమిత్తం మరియు ఆలయ అభివృద్ధి నిమిత్తం భారీ విరాళాన్ని అందజేశారు.

 

దాతలు ఈరోజు ఆలయ అధికారులను కలిసి 32.500 గ్రాములు రూ.5,32,500/- (ఐదు లక్షల ముప్పై రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే) విలువైన విరాళాన్ని సమర్పించారు. 

 

ఆలయ అధికారులు దాతలకు స్వామి వారి శేషవస్త్రం మరియు ప్రసాదాలను అందజేసి, ప్రత్యేక ఆశీర్వచనం గావించారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాదికారి వారి సమక్షములో చైర్మన్ గారు మరియు పాలక మండలి సభ్యులు చేతులు మీదుగా విరాళం అందజేసినారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: మద్యం మత్తులో డ్రైవ్ చేయడంతో ప్రమాదం.
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని యుఎన్ఆర్ సర్కిల్ 42వ జాతీయ రహదారిపై చిత్తూరు నుంచి అనంతపురం...
By Kothuru Murali 2026-01-28 09:10:02 0 163
Telangana
నిజామాబాద్: ప్రజాపాలన ప్రగతిప్రణాలిక
నగరంలోని శ్రీరామ గార్డెన్ లో నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక నియోజకవర్గ స్థాయి సమావేశంలో...
By Sadaq Sadaq 2026-05-02 14:52:44 0 133
Andhra Pradesh
ఫ్రాన్స్పై 200 శాతం టారిఫ్లు విధిస్తానని బెదిరిస్తున్న ట్రంప్
*ఫ్రాన్స్‌పై 200 శాతం టారిఫ్‌లు: ట్రంప్‌*   * వాషింగ్టన్‌:...
By Rajini Kumari 2026-01-20 10:31:15 0 169
Telangana
ప్రజల కోసం రాజీపడను: ఈటల.|
"కాళేశ్వరం అవినీతిపై చర్యలు తీసుకోండి... నీటి సరఫరాపై రాజకీయాలు వద్దని వ్యాఖ్య" మేడ్చల్...
By Sidhu Maroju 2026-07-10 10:11:43 0 134
West Bengal
West Bengal Strengthens Sports Development Across State
West Bengal is expanding its sports ecosystem through investments in modern infrastructure,...
By Fathima Safa 2026-07-02 05:48:15 0 56
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com