ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని అందరూ వినియోగించుకోవాలి గద్దె అనురాధ
*ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి*
*తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాయంలో ప్రజాదర్బార్లో ప్రజల నుంచి వినతులను స్వీకరించిన గద్దె అనురాధ*
+++++
ప్రజా సమస్యలను స్వయంగా తెల్సుకునేందుకు ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ కార్యాక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ చెప్పారు.
పటమట అశోక్నగర్లోని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజాదర్భార్ కార్యాక్రమం శుక్రవారం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనరాధ హజరై ప్రజల నుంచి సమస్యలపై వినతిపత్రాలను తీసుకున్నారు.
ఈ సందర్బంగా గద్దె అనురాధ మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెల్సుకునేందుకు ప్రతి శుక్రవారం ప్రజాదర్బార్ను నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రజాదర్భార్లో తెలియజేసిన ప్రతి సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజా సమస్యల గురించి అస్సలు పట్టించుకోలేదని చెప్పారు. ప్రజాదర్బార్లో తెలియజేసిన ప్రతి సమస్యను ఆన్లైన్లో నమోదు చేసి పరిష్కరించే విధంగా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నామని చెప్పారు.
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz