పెద్దాపురం: అధిక యూరియాతో పెట్టుబడి నష్టం
Posted 2026-03-11 07:51:38
0
1K
పంటల సాగులో అధికంగా యూరియా ఎరువులు వాడటం వల్ల రైతులకు పెట్టుబడి నష్టం కలిగే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ విజయకుమార్ హెచ్చరించారు.
మంగళవారం పెద్దాపురం మండలం గోరింట, వడ్లమూరు గ్రామాల్లో ఆయన పర్యటించి రబీ పంటల పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ పంటల సాగులో సమతుల్యంగా ఎరువులు వాడాలని, పరిమితికి మించి యూరియా వినియోగిస్తే పంటలకు మరియు నేల నాణ్యతకు నష్టం కలుగుతుందని తెలిపారు.
రైతులు ప్రభుత్వం రూపొందించిన ఫార్మర్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని వినియోగించుకోవాలని సూచించారు. ఈ యాప్ ద్వారా పంటల వివరాలు, వ్యవసాయ సూచనలు, ప్రభుత్వ పథకాల సమాచారం పొందవచ్చని వివరించారు.
ఈ పర్యటనలో మండల వ్యవసాయ అధికారి సంజయ్ కుమార్ మరియు స్థానిక రైతులు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మేడ్చల్ జిల్లాలో అంబేద్కర్ జయంతి (ఏప్రిల్ 14) వేడుకలు ప్రతి ఏటా ఘనంగా జరుగుతాయి.
మేడ్చల్ నియోజకవర్గం పరిధిలో ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ...
నీతి, నిజాయితీలతో విధులు నిర్వహించాలి పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం
🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్
రాష్ట్రంలో...
నో పెట్రోల్ .. నో హెల్మెట్ : కర్నూల్
కర్నూలు జిల్లా :
కర్నూలు జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలలో మరణాలను తగ్గించాలని ఉద్దేశంతో...
నిజామాబాద్
పీఎం స్వానిధి పథకం ద్వారా మొదటి విడతలో 10000, రెండవ విడతలో 20000, మూడవ విడతలో 50,000 రూపాయలు లోను...
Kadapa RTC bus fire: కడప జిల్లాలో కాలి బూడిదైన ఆర్టీసీ బస్సు... తప్పిన పెను ప్రమాదం.
Kadapa RTC bus fire: కడప జిల్లాలో కాలి బూడిదైన ఆర్టీసీ బస్సు... తప్పిన పెను ప్రమాదం
05-04-2026...