అల్వాల్ ల్లో మైనర్ బాలికపై అత్యాచార కేసు- నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాఘార శిక్ష.|

0
147

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై జరిగిన అమానుష ఘటనలో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. 

నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ మేడ్చల్ ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టు బుధవారం తీర్పునిచ్చింది.

కేసు వివరాల్లోకి వెళ్తే..

2024లో అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్.జి. నారాయణ అనే వ్యక్తి ఒక మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 

దీనిపై బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అల్వాల్ పోలీసులు క్రైమ్ నంబర్ 275/2024 కింద ఐపిసి సెక్షన్లు 376(2)(d), 376(3) మరియు పోక్సో (POCSO) చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఈ కేసు విచారణను చేపట్టిన మేడ్చల్ ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి వెంకటేష్ , ప్రాసిక్యూషన్ సమర్పించిన సాక్ష్యాధారాలను పరిశీలించి నిందితుడు నారాయణను దోషిగా నిర్ధారించారు. 

దోషికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు 10 వేల రూపాయల జరిమానా విధించారు.

అలాగే, బాధితురాలికి ప్రభుత్వం తరపున 2 లక్షల రూపాయల పరిహారం అందజేయాలని కోర్టు ఆదేశించింది.

ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి. ప్రభాకర్ రెడ్డి సమర్థవంతంగా వాదనలు వినిపించారు. 

ఇన్ స్పెక్టర్ రాహుల్ దేవ్ లోతుగా దర్యాప్తు చేయగా, అల్వాల్ ఎస్‌హెచ్‌ఓ (SHO) ప్రశాంత్ కేసు పురోగతిని పర్యవేక్షించారు. 

కోర్ట్ డ్యూటీ ఆఫీసర్ పి. ఉప చారి సాక్షుల హాజరు, కోర్టు సమన్వయంలో కీలక పాత్ర పోషించారు.

మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో మైనర్లపై అఘాయిత్యాలకు పాల్పడే వారికి ఈ శిక్ష ఒక హెచ్చరిక అని పోలీసు అధికారులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

 

#sidhumaroju 

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
79 మంది మీడియా ప్రతినిధులకు అక్రిడేషన్లు మంజూరు
బుధవారం కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్, డిఎంఎసి చైర్మన్ సుమిత్ కుమార్ ఐఏఎస్ అధ్యక్షతన...
By Kothuru Murali 2026-04-16 17:15:32 0 76
Andhra Pradesh
దేవాలయాలు నాగరికతకు అభివృద్ధికి భక్తి పారవశానికి సోపానాలు మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి
ఈరోజు మధ్యాహ్నం అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం రామాపురం మండలం సరస్వతి పల్లె గ్రామం నాయిని...
By Benguluri Madhubabu 2026-03-08 12:56:55 0 155
Telangana
హిమాయతానగర్ గ్రామ చౌరస్తా లో ఆక్సిడెంట్
ఈరోజు హిమాయత్ నగర్ చౌరస్తా వద్ద ఓ ద్విచక్ర వాహనదారున్ని గుర్తుతెలియని లారీ ఢీకొనడంతో అతనికి తీవ్ర...
By Veeresh Kumar 2026-03-23 13:07:28 0 204
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం: సోలార్ కంచెను దాటలేక మరోవైపు తిరిగిన ఏనుగులు
చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలంలో పంటలను ధ్వంసం చేస్తున్న ఏనుగుల గుంపు...
By Kothuru Murali 2026-04-08 07:31:45 0 100
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com