నకిలీ పత్రాలతో భూమి కబ్జా యత్నం: బాధితుల ఆరోపణలు.

0
97

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో, దిగువపల్లి పంచాయతీ బోయకొండ గంగాపురం ప్రాంతానికి చెందిన మోపురి పద్మ, ఆనంద్ తమ మూడు సెంట్ల భూమిని నకిలీ రికార్డులతో కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితులు ఆరోపించారు. బుధవారం మదనపల్లె ప్రెస్ క్లబ్‌లో మీడియా సమావేశంలో బాధితురాలు పద్మ మాట్లాడుతూ, మగారాల వేణు, పుష్పలత, హేమ సుందరం తమపై దాడికి దిగుతున్నారని, కోర్టులో ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికీ తప్పుడు పత్రాలతో భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ ఘటనపై అధికారులు వెంటనే స్పందించి దర్యాప్తు చేపట్టి న్యాయం చేయాలని బాధితులు కోరారు

Search
Categories
Read More
Andhra Pradesh
రోడ్డు ప్రమాదంలో మరణించిన ఇంటర్లో సత్తా చాటిన విద్యార్థులు
రోడ్డు ప్రమాదంలో మరణించినా.. ఇంటర్‌లో సత్తా చాటిన విద్యార్థులు   Apr 13, 2026, ...
By Rajini Kumari 2026-04-13 08:14:03 0 96
Andhra Pradesh
పుంగనూరు: 6 వేల ఏళ్లనాటి శివలింగం
పుంగనూరులోని నెక్కొంది కొండపై ఉన్న శ్రీఅగస్తీశ్వర స్వామి ఆలయంలో 6 వేల సంవత్సరాల పురాతన శివలింగం...
By Kothuru Murali 2026-02-15 05:43:43 1 476
Telangana
నేలకొండపల్లిలో యూరియా కష్టాల నుంచి ఊరట..
నేలకొండపల్లి మండలంలో ప్రభుత్వ యూరియా యాప్ ద్వారా ఎరువుల పంపిణీ సజావుగా సాగుతోందని మండల వ్యవసాయ...
By Krishna Balina 2026-02-09 06:01:39 0 196
Andhra Pradesh
మదనపల్లిలో 15000 మంది తిలకించేలా రిపబ్లిక్ డే.
మదనపల్లెలో 77వ రిపబ్లిక్ వేడుకలను సోమవారం బీటీ కళాశాల మైదానంలో అంగరంగ వైభవంగా నిర్వహించడానికి...
By Pagadala Venkateswar 2026-01-25 12:28:14 0 133
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com