ఆకస్మికంగా తనిఖీ చేసిన :: జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ స్నేహ శబరీష్

0
366

మహబూబాబాద్::::పట్టణంలోని నగరపాలక సంస్థ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ స్నేహ శబరీష్, ఆకస్మికంగా తనిఖీ చేశారు, ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టి నిర్వహిస్తున్న 99 రోజుల ప్రజా పాలన ప్రగతిప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మార్చ్ 6 నుండి జూన్ 12 వరకు షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది, అందులో భాగంగా గత రెండు మూడు రోజుల నుండి జిల్లా స్థాయి ప్రత్యేక అధికారులు అన్ని జిల్లా ప్రధాన కార్యాలయాలలో ఫైళ్ల క్లియరెన్స్, సానిటేషన్, కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది, జిల్లా కలెక్టర్ తమ పర్యటనలో భాగంగా మున్సిపల్ కార్యాలయ పరిసరాలను పరిశీలించి ఫైళ్లను వెంటనే క్లియరెన్స్ చేయాలని, అనవసరమైన స్క్రాప్ ను వెంటనే ఖండం చేయాలని, సూచించారు, సుమారు గంటన్నరకు పైగా కార్యాలయంలో ఆమె తనిఖీలు నిర్వహించి స్వయంగా ఫైళ్లను పరిశీలించారు, వివిధ పనుల దరఖాస్తుల నిమిత్తం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల యొక్క వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని, వారి సమస్యలను సావధానంగా పరిశీలించి వారికి తగిన విధంగా పరిష్కారం చూపాలని తెలిపారు, మున్సిపల్ పరిధిలో అంతర్గత ఫైళ్ల క్లియరెన్స్, అభివృద్ధికి సంబంధించిన పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేయాలని, నగర పరిధిలో ఉన్నటువంటి కాలనీలలో విద్యుత్, త్రాగునీరు సరఫరా లో ఎలాంటి అంతరాయాలు లేకుండా చూడాలని, సానిటేషన్ షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని, ఆదేశించారు, జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక అధికారులు వారికి కేటాయించిన మండలాలు, ప్రాంతాలలో 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. కలెక్టర్ వెంట మున్సిపల్ చైర్ పర్సన్ గుగులోతు జ్యోతి, మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్, తహసిల్దార్ రాజేశ్వరరావు, సంబంధిత అధికారులు ఉన్నారు.

Search
Categories
Read More
Telangana
నీట్ పేపర్ లీక్ ను నిరసిస్తూ మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా
మంచిర్యాల : కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నీట్ పరీక్షా పేపర్ లీకేజ్ ను నిరసిస్తూ ఈరోజు...
By Avunoori Mahesh 2026-05-14 10:02:00 0 196
Andhra Pradesh
మైనర్ బాలికపై లైంగిక దాడి, తల్లి ఆత్మహత్యాయత్నం.
అన్నమయ్య జిల్లా మొలకలచెరువు మండలం గూడుపల్లి గ్రామంలో 10 ఏళ్ల బాలికపై యువకుడు లైంగిక దాడికి...
By Pagadala Venkateswar 2026-03-23 04:02:04 0 179
Andhra Pradesh
పుంగనూరు: ఎంపీ చొరవతో పిఎం రిలీఫ్ ఫండ్ మంజూరు
వైయస్ఆర్సిపి లోక్ సభ పక్ష నేత, రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి వెంకటరెడ్డి తన...
By Kothuru Murali 2026-03-12 10:59:24 0 137
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గ : రొంపిచర్ల పెను ప్రమాదం
బుధవారం పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల మండలంలో పెను ప్రమాదం తప్పింది. తిరుపతి నుంచి పీలేరుకు...
By Kothuru Murali 2026-05-21 16:48:16 0 87
SURAKSHA
TN Police Dedicated Patrols for Women’s Safety
For the protection of women and students, the Tamil Nadu Police conducted special patrols in...
By Kalaga Sailaja 2026-06-27 10:26:39 0 113
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com