ఆకస్మికంగా తనిఖీ చేసిన :: జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ స్నేహ శబరీష్

0
268

మహబూబాబాద్::::పట్టణంలోని నగరపాలక సంస్థ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ స్నేహ శబరీష్, ఆకస్మికంగా తనిఖీ చేశారు, ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టి నిర్వహిస్తున్న 99 రోజుల ప్రజా పాలన ప్రగతిప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మార్చ్ 6 నుండి జూన్ 12 వరకు షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది, అందులో భాగంగా గత రెండు మూడు రోజుల నుండి జిల్లా స్థాయి ప్రత్యేక అధికారులు అన్ని జిల్లా ప్రధాన కార్యాలయాలలో ఫైళ్ల క్లియరెన్స్, సానిటేషన్, కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది, జిల్లా కలెక్టర్ తమ పర్యటనలో భాగంగా మున్సిపల్ కార్యాలయ పరిసరాలను పరిశీలించి ఫైళ్లను వెంటనే క్లియరెన్స్ చేయాలని, అనవసరమైన స్క్రాప్ ను వెంటనే ఖండం చేయాలని, సూచించారు, సుమారు గంటన్నరకు పైగా కార్యాలయంలో ఆమె తనిఖీలు నిర్వహించి స్వయంగా ఫైళ్లను పరిశీలించారు, వివిధ పనుల దరఖాస్తుల నిమిత్తం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల యొక్క వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని, వారి సమస్యలను సావధానంగా పరిశీలించి వారికి తగిన విధంగా పరిష్కారం చూపాలని తెలిపారు, మున్సిపల్ పరిధిలో అంతర్గత ఫైళ్ల క్లియరెన్స్, అభివృద్ధికి సంబంధించిన పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేయాలని, నగర పరిధిలో ఉన్నటువంటి కాలనీలలో విద్యుత్, త్రాగునీరు సరఫరా లో ఎలాంటి అంతరాయాలు లేకుండా చూడాలని, సానిటేషన్ షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని, ఆదేశించారు, జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక అధికారులు వారికి కేటాయించిన మండలాలు, ప్రాంతాలలో 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. కలెక్టర్ వెంట మున్సిపల్ చైర్ పర్సన్ గుగులోతు జ్యోతి, మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్, తహసిల్దార్ రాజేశ్వరరావు, సంబంధిత అధికారులు ఉన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మార్కాపురం: స్కానింగ్ సెంటర్లలో ఫీజు వివరాలు ఎక్కడ.
మార్కాపురం: స్కానింగ్ సెంటర్లలో ఫీజు వివరాలు ఎక్కడ. మార్కాపురం జిల్లా కేంద్రంలో స్కానింగ్...
By Chennaiah Kati 2026-03-10 10:55:30 0 273
Andhra Pradesh
4 లు 6 లు సూపర్ ఓవర్లతో దద్దరిల్లుతున్న నారా లోకేష్ క్రీడా ప్రాంగణం
*ఫోర్లు, సిక్సర్ లు, సూపర్ ఓవర్ లతో దద్దరిల్లుతున్న నారా లోకేష్ క్రీడా ప్రాంగణం*   ...
By Rajini Kumari 2025-12-30 10:25:10 0 168
Andhra Pradesh
Pawan Kalyan: అమరావతి బిల్లుకు లోక్‌సభ ఆమోదం.. ఇది చారిత్రాత్మక ఘట్టమన్న పవన్ కల్యాణ్.
ఆంధ్రప్రదేశ్ ఏకైక, శాశ్వత రాజధానిగా అమరావతిని నిర్ధారిస్తూ లోక్‌సభలో ప్రవేశపెట్టిన బిల్లు...
By Pagadala Venkateswar 2026-04-02 06:17:42 0 159
Andhra Pradesh
అభిమానులకు, కూటమి శ్రేణులకు ధన్యవాదాలు తెలిపిన చినబాబు.
తెలుగు రాష్ట్ర యువత అధికార ప్రతినిధి శ్రీరామ్ చినబాబు ఆదివారం మదనపల్లె నియోజకవర్గ ప్రజలకు,...
By Pagadala Venkateswar 2026-03-16 02:15:45 0 117
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com