మార్చి 9న 'ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక' చీరాల మున్సిపల్ కార్యాలయంలో నిర్వహణ

0
597

ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించే పి.జి.ఆర్.ఎస్ కార్యక్రమాన్ని మార్చి 9న సోమవారం చీరాల మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. చీరాల మున్సిపల్ కార్యాలయం.

 సమయం ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు. ఉదయం 9 నుండి 10 గంటల వరకు అధికారులతో సమీక్ష, అనంతరం 10 గంటల నుండి ప్రజల నుండి అర్జీల స్వీకరణ ఉంటుంది. సోమవారం బాపట్ల జిల్లా కలెక్టరేట్‌కు అర్జీదారులు ఎవరూ రావద్దని, అన్ని శాఖల జిల్లా అధికారులు చీరాలలోనే అందుబాటులో ఉంటారని కలెక్టర్ స్పష్టం చేశారు. చీరాల రాలేని వారు తమ పరిధిలోని తహశీల్దార్ లేదా ఎంపీడీఓ కార్యాలయాల్లో అర్జీలు సమర్పించవచ్చు అని తెలిపారు. ఫిర్యాదుల స్థితిగతుల కోసం 1100 నంబర్‌కు కాల్ చేయవచ్చు లేదా Meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను పరిష్కరించుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు.

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
Chandrababu: ప్రకృతి సేద్యంతో భూమిని బాగు చేద్దాం: దావోస్ వేదికగా సీఎం చంద్రబాబు పిలుపు.
Chandrababu: ప్రకృతి సేద్యంతో భూమిని బాగు చేద్దాం: దావోస్ వేదికగా సీఎం చంద్రబాబు పిలుపు...
By Pagadala Venkateswar 2026-01-22 06:29:38 0 148
Andhra Pradesh
పేకాట స్థావరం పై దాడి
బుధవారం ఈపురుపాలెం  పోలీస్ స్టేషన్ పరిధిలో నక్కల వారి పాలెం నందు జరుగుచున్న పేకాట స్థావరం పై...
By Vadlamudi NagaVenkat 2026-03-18 14:33:54 0 772
Andhra Pradesh
ఇచ్చాపురంలొ ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
పంజా స్ట్రీట్ మోడల్ పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా  ఘనంగా వేడుకలు...
By Jeeru Kumar 2026-03-08 10:43:30 0 927
Jammu & Kashmir
J&K Apple Industry and Horticulture See New Growth
Jammu & Kashmir continues to strengthen its apple industry and horticulture sector in 2026...
By Fathima Safa 2026-07-04 06:35:25 0 31
Telangana
మామూనూర్ ఎయిర్పోర్ట్ గ్రీన్ సిగ్నల్
వరంగల్ మామూనూర్ ఎయిర్పోర్ట్  పునరుద్దరణ పనులు వేగంగా సాగుతున్నాయి శనివారం ఏ ఏ ఐ హైదరాబాద్ జి...
By CM_ Krishna 2025-12-28 06:03:41 0 313
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com