పెద్దాపురం పురపాలికకు స్పెషల్ గ్రేడ్ హోదా

0
1K

చరిత్రాత్మక ప్రాధాన్యం కలిగిన పెద్దాపురం పురపాలికకు రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ గ్రేడ్ హోదా మంజూరు చేస్తూ మంగళవారం ప్రభుత్వ ఉత్తర్వులు (జీవో) జారీ చేసింది. ఈ నిర్ణయంతో పట్టణ అభివృద్ధికి మరిన్ని నిధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.

జనవరి నెలలో పురపాలిక అధికారులు కౌన్సిల్ తీర్మానం ద్వారా స్పెషల్ గ్రేడ్ హోదా మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా, ప్రభుత్వం వాటిని పరిశీలించి ఆమోదం తెలిపింది.

1915లో స్థాపించబడిన పెద్దాపురం పురపాలిక 2009లో ద్వితీయ శ్రేణి స్థాయికి చేరింది. ప్రస్తుతం పట్టణ జనాభా 57,779గా ఉండగా, పురపాలిక వార్షిక ఆదాయం సుమారు రూ.26.28 కోట్లుగా ఉంది.

స్పెషల్ గ్రేడ్ హోదా లభించడం వల్ల పట్టణంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి, పారిశుద్ధ్యం, రహదారులు, డ్రైనేజీ వంటి రంగాలకు మరింత నిధులు లభించే అవకాశాలు ఉన్నాయని పురపాలిక కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.

Search
Categories
Read More
Business & Finance
Wage Hike for Sanitation Workers to Boost Rural Economy
The Haryana government has increased the monthly salary of rural sanitation workers by ₹2,100,...
By Navya Sree 2026-07-01 08:50:11 0 65
SURAKSHA
హైదరాబాద్: దేశంలోనే అత్యంత సురక్షితమైన డిజిటల్ నగరం
సాంకేతిక పురోగతితో పాటు సైబర్ భద్రతలో హైదరాబాద్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. తెలంగాణ స్టేట్...
By Kalaga Sailaja 2026-06-24 10:39:05 0 70
Andhra Pradesh
పుంగనూరు: గుండెపోటుతో విలేఖరి మృతి
పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం సరస్వతీపురానికి చెందిన సీనియర్ రిపోర్టర్ జగదీష్ సోమవారం...
By Kothuru Murali 2026-03-02 05:08:00 0 143
Telangana
మంచిర్యాల ఎంపీ కార్యాలయం లో ప్రజా దర్బార్ నిర్వహించిన ఎంపీ గడ్డం వంశీ కృష్ణ
మంచిర్యాల : పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారు మంచిర్యాలలోని తన ఎంపీ కార్యాలయంలో...
By Avunoori Mahesh 2026-04-21 06:33:37 0 152
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గ:సదుం మండలంలో పర్యటించిన ఎన్సీడీసీ జాయింట్ డైరెక్టర్
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలో ఎన్సీడీసీ జాయింట్ డైరెక్టర్ ప్రవీణ్ ఆదివారం పర్యటించారు. బర్డ్...
By Kothuru Murali 2026-02-16 11:35:12 0 188
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com