జై సాధువుల ఆశీస్సులు పొందిన ఎంపీ కేశినేని శివనాద్
*ప్రచురణార్ధం* *23-02-2026*
*జైన్ సాధువుల ఆశీస్సులు పొందిన ఎంపీ కేశినేని శివనాథ్*
*జైన్ తేరాపంత్ భవన్ కు జైన్ సాధువులు రష్మీమునిశ్రీ, శివయుష్ మునిశ్రీ రాక*
విజయవాడ: గురునానక్ కాలనీలోని జైన్ తేరాపంత్ భవన్కు విచ్చేసిన జైన్ తేరాపంత్ ఆచార్య మహాశ్రమణ్ శిష్యులు రష్మీమునిశ్రీ, శివయుష్ మునిశ్రీలను సోమవారం విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు పొందారు.
రాజస్థాన్ నుంచి దేశవ్యాప్తంగా పాదయాత్ర చేస్తూ విజయవాడకు చేరుకున్న జైన్ సాధువులను ఎంపీ కేశినేని శివనాథ్ జైన్ తేరాపంత్ భవన్లో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సాధువులు అహింస, సద్గుణాలు, దురాలవాట్ల నివారణపై ఆధ్యాత్మిక బోధనలు అందించారు.
ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ సమాజంలో నైతిక విలువల పెంపొందనకు జైన్ సాధువుల సేవలు ఎంతో విలువైనవని తెలిపారు. వారి పాదయాత్రలు ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యం పెంచుతున్నాయని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో జైన్ సమాజ ప్రముఖులు దినేష్ జైన్, శ్యామ్ సుఖా, జగదీష్ జైన్, మనోజ్ పుగ్లియా, రాజ్కుమార్ బైడ్, సంగీత దుగర్, సందీప్ కోఠారి, టిడిపి నాయకులు పీతా బుజ్జిలతో పాటు తదితరులు పాల్గొన్నారు.
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz