పెద్దాపురం పురపాలికకు స్పెషల్ గ్రేడ్ హోదా

0
766

చరిత్రాత్మక ప్రాధాన్యం కలిగిన పెద్దాపురం పురపాలికకు రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ గ్రేడ్ హోదా మంజూరు చేస్తూ మంగళవారం ప్రభుత్వ ఉత్తర్వులు (జీవో) జారీ చేసింది. ఈ నిర్ణయంతో పట్టణ అభివృద్ధికి మరిన్ని నిధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.

జనవరి నెలలో పురపాలిక అధికారులు కౌన్సిల్ తీర్మానం ద్వారా స్పెషల్ గ్రేడ్ హోదా మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా, ప్రభుత్వం వాటిని పరిశీలించి ఆమోదం తెలిపింది.

1915లో స్థాపించబడిన పెద్దాపురం పురపాలిక 2009లో ద్వితీయ శ్రేణి స్థాయికి చేరింది. ప్రస్తుతం పట్టణ జనాభా 57,779గా ఉండగా, పురపాలిక వార్షిక ఆదాయం సుమారు రూ.26.28 కోట్లుగా ఉంది.

స్పెషల్ గ్రేడ్ హోదా లభించడం వల్ల పట్టణంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి, పారిశుద్ధ్యం, రహదారులు, డ్రైనేజీ వంటి రంగాలకు మరింత నిధులు లభించే అవకాశాలు ఉన్నాయని పురపాలిక కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు రాష్ట్రమంతా ఘనంగా నిర్వహిస్తున్నారు
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం...
By Rajini Kumari 2025-12-21 08:22:03 0 165
Andhra Pradesh
ప్రజల నుండి అందే అర్జీల్లో తక్షణం పరిష్కారం
గుంటూరు నగరపాలక సంస్థ ప్రతి సోమవారం జరిగే పిజిఆర్ఎస్ కు అన్ని విభాగాల అధికారులు హాజరు కావాలని,...
By John Baji 2025-12-30 01:40:24 0 160
Andhra Pradesh
కమ్మవారి పాలెం గ్రామంలో ప్రజల త్రాగునీటి కష్టాలు
నందిగామ మండలం కమ్మవారిపాలెం గ్రామంలో మంచినీటి సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజాసంఘాలు ఆద్వర్యంలో...
By Patan Khuddus 2026-05-07 02:22:46 0 212
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com