పిల్లల ఎదుగుదలలో పోషకాహారం కీలకం – డాక్టర్ ఉమాకాంత్ సూచనలు

0
329

రాజమండ్రి: చిన్నపిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలలో సరైన ఆహారపు అలవాట్లు ఎంతో కీలకమని రాజమండ్రిలోని శ్రీ హర్షిత గ్యాస్ట్రో హాస్పిటల్‌కు చెందిన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ ఉమాకాంత్ తెలిపారు. పిల్లలకు ఆరో నెల నుండి పోషకాహారం ప్రారంభించడం ఉత్తమమని ఆయన సూచించారు.

మన పూర్వీకులు పాటించిన అన్నప్రాశన సంప్రదాయం ప్రకారం ఆరో నెల నుంచి పిల్లలకు ఆహారం పెట్టడం శ్రేయస్కరమని తెలిపారు. ఈ దశలో సెర్లాక్ వంటి ఆహార పదార్థాలను కూడా ఇవ్వవచ్చని పేర్కొన్నారు. పిల్లలకు ఇచ్చే ఆహారాన్ని బాగా ఉడికించి మెత్తగా చేసి అందించాలి అని చెప్పారు.

ఎనిమిది నెలల వయస్సు నుండి వివిధ రకాల పండ్లు, కూరగాయలను బాగా ఉడికించి ఆహారంలో చేర్చాలని సూచించారు. పిల్లల జీర్ణశక్తి పెరిగే కొద్దీ కొత్త రకాల ఆహార పదార్థాలను క్రమంగా ఆహారంలో భాగం చేయాలని అన్నారు.

పిల్లలకు వారి ఆకలి మేరకు మాత్రమే ఆహారం ఇవ్వాలని, తల్లిదండ్రులు బలవంతంగా ఎక్కువగా తినిపిస్తే వాంతులు వంటి సమస్యలు తలెత్తే అవకాశముందని డాక్టర్ ఉమాకాంత్ హెచ్చరించారు.

అలాగే పిల్లల ఎత్తు పెరగడం ప్రధానంగా పోషకాహారం మరియు వంశపారంపర్య లక్షణాలపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. తల్లిదండ్రులు పొట్టిగా ఉన్నప్పటికీ తాతముత్తాతల లక్షణాల ప్రభావంతో కొందరు పిల్లలు ఎత్తుగా పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ఆరోగ్యకరమైన ఎదుగుదలకు సమతుల్యమైన పోషకాహారం తప్పనిసరిగా అవసరమని ఆయన వివరించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Chandrababu Naidu: ఇది ఎక్సలెంట్ న్యూస్: సీఎం చంద్రబాబు.
Chandrababu Naidu: ఇది ఎక్సలెంట్ న్యూస్: సీఎం చంద్రబాబు 30-01-2026 Fri 14:07 | Andhra...
By Pagadala Venkateswar 2026-01-31 06:42:17 0 306
Andhra Pradesh
టిడిపి కేంద్ర కార్యాలయంలో నారా లోకేష్ ప్రజా దర్బార్
*Press Release*   *టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ 85వ రోజు ప్రజాదర్బార్*...
By Rajini Kumari 2026-03-24 12:03:26 0 222
Telangana
"మైనంపల్లి ఆదేశాలతో గ్రౌండ్‌లోకి కాంగ్రెస్ నాయకులు”
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ శాసనసభ్యులు మైనంపల్లి...
By Sidhu Maroju 2026-05-22 09:10:14 0 242
Arunachal Pradesh
Arunachal Releases Wages for 4,745 Excess Workers
The Arunachal Pradesh government has ordered the immediate release of monthly wages for 4,745...
By Tejaswini Komanduru 2026-06-15 10:20:39 0 197
Andhra Pradesh
జేఈఈ మెయిన్స్ టాపర్లను అభినందించిన సీఎం చంద్రబాబు.
  జేఈఈ మెయిన్స్ టాపర్లను అభినందించిన సీఎం చంద్రబాబు 04-05-2026 Mon 07:39 | Both States...
By Pagadala Venkateswar 2026-05-04 06:08:50 0 90
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com