జ్యోతిరావు ఫూలే జయంతి : ఆల్వాల్ ప్రెస్ క్లబ్ భూమిపూజకు శ్రీకారం.|

0
162

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: జ్యోతిరావు ఫూలే జయంతిని ఆల్వాల్ ల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే,  మైనంపల్లి హనుమంతరావు నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా ఫూలే చిత్రపటానికి పూలమాలలు అర్పించి ఘన నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, అధ్యక్షులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని, సమాజానికి ఆయన చేసిన అమూల్య సేవలను స్మరించుకున్నారు.

అనంతరం, హనుమంతరావు ఆల్వాల్ ప్రెస్ క్లబ్ నిర్మాణానికి భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు. సుమారు రూ.1 కోటి వ్యయంతో, దాదాపు 2000 చదరపు అడుగుల విస్తీర్ణంలో స్టిల్ట్‌తో పాటు రెండు అంతస్తులతో ఈ భవనం నిర్మించబడనుంది.

ఈ కార్యక్రమంలో ఆల్వాల్ ప్రెస్ క్లబ్ సభ్యులు రాములు (అధ్యక్షుడు), మల్లేష్, మధుసూదన్ రెడ్డి, ప్రసాద్, చంద్రశేఖర్, శివకుమార్, దేవేందర్, శ్రీరాములు, రాజేష్, ఉపేందర్, శేఖర్, సురేష్, హరి ప్రకాష్, రాజినీ కాంత్ , కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

#sidhumaroju 

Alwal

Search
Categories
Read More
Telangana
ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి.
డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ వర్థంతి సందర్భంగా, మల్కాజిగిరి ఎమ్మెల్యే  మర్రి రాజశేఖర్ రెడ్డి...
By Sidhu Maroju 2025-07-06 17:38:56 0 1K
Andhra Pradesh
మదనపల్లి: మానవత్వం పరిమళించేలా హెల్పింగ్ మైండ్స్.
మదనపల్లి ఆర్టీసీ బస్ స్టాండ్‌లో మంగళవారం భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న ఓ వ్యక్తి మృతి...
By Pagadala Venkateswar 2026-01-28 10:00:44 0 104
Telangana
హోలీ సంబరాల్లో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్.|
   మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా  :  బోయిన్ పల్లి లోని మల్లారెడ్డి గార్డెన్స్...
By Sidhu Maroju 2026-03-04 10:37:28 0 119
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com