పిల్లల ఎదుగుదలలో పోషకాహారం కీలకం – డాక్టర్ ఉమాకాంత్ సూచనలు
రాజమండ్రి: చిన్నపిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలలో సరైన ఆహారపు అలవాట్లు ఎంతో కీలకమని రాజమండ్రిలోని శ్రీ హర్షిత గ్యాస్ట్రో హాస్పిటల్కు చెందిన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ ఉమాకాంత్ తెలిపారు. పిల్లలకు ఆరో నెల నుండి పోషకాహారం ప్రారంభించడం ఉత్తమమని ఆయన సూచించారు.
మన పూర్వీకులు పాటించిన అన్నప్రాశన సంప్రదాయం ప్రకారం ఆరో నెల నుంచి పిల్లలకు ఆహారం పెట్టడం శ్రేయస్కరమని తెలిపారు. ఈ దశలో సెర్లాక్ వంటి ఆహార పదార్థాలను కూడా ఇవ్వవచ్చని పేర్కొన్నారు. పిల్లలకు ఇచ్చే ఆహారాన్ని బాగా ఉడికించి మెత్తగా చేసి అందించాలి అని చెప్పారు.
ఎనిమిది నెలల వయస్సు నుండి వివిధ రకాల పండ్లు, కూరగాయలను బాగా ఉడికించి ఆహారంలో చేర్చాలని సూచించారు. పిల్లల జీర్ణశక్తి పెరిగే కొద్దీ కొత్త రకాల ఆహార పదార్థాలను క్రమంగా ఆహారంలో భాగం చేయాలని అన్నారు.
పిల్లలకు వారి ఆకలి మేరకు మాత్రమే ఆహారం ఇవ్వాలని, తల్లిదండ్రులు బలవంతంగా ఎక్కువగా తినిపిస్తే వాంతులు వంటి సమస్యలు తలెత్తే అవకాశముందని డాక్టర్ ఉమాకాంత్ హెచ్చరించారు.
అలాగే పిల్లల ఎత్తు పెరగడం ప్రధానంగా పోషకాహారం మరియు వంశపారంపర్య లక్షణాలపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. తల్లిదండ్రులు పొట్టిగా ఉన్నప్పటికీ తాతముత్తాతల లక్షణాల ప్రభావంతో కొందరు పిల్లలు ఎత్తుగా పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ఆరోగ్యకరమైన ఎదుగుదలకు సమతుల్యమైన పోషకాహారం తప్పనిసరిగా అవసరమని ఆయన వివరించారు.
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy