తాడేపల్లిలో ఘనంగా సావిత్రిబాయి పూలే వర్ధంతి చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

0
956

తాడేపల్లి: గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో సంఘ సంస్కర్త, భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, మహిళా విద్యాభివృద్ధికి సావిత్రిబాయి పూలే చేసిన సేవలు భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచాయని అన్నారు. సమాజంలో మహిళలకు విద్య అందించేందుకు ఆమె చేసిన పోరాటం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని పేర్కొన్నారు.

సమాజంలో మహిళల విద్యా విస్తరణ కోసం సావిత్రిబాయి పూలే చేసిన కృషి ఎంతో గొప్పదని, అనేక అడ్డంకులను ఎదుర్కొంటూ మహిళా సాధికారతకు ఆమె మార్గం సుగమం చేశారని తెలిపారు. మహిళలు విద్య ద్వారా అభివృద్ధి సాధించాలనే ఆమె ఆశయాన్ని ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు పలువురు పాల్గొన్నారు.

Search
Categories
Read More
SURAKSHA
John Neihlaia, IPS: Serving Mizoram with Integrity
The Journey Begins "The badge of an IPS officer symbolizes not only authority but also...
By Fathima Safa 2026-07-21 12:38:20 0 31
Andhra Pradesh
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం కిమ్స్ ఆసుపత్రిలో స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులు, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరుని అడిగి తెలుసుకున్నారు.
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం కిమ్స్ ఆసుపత్రిలో స్టీల్ ప్లాంట్ ప్రమాద...
By Chennaiah Kati 2026-06-14 07:03:02 0 95
Telangana
ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలేరు నియోజకవర్గం లో ప్రభుత్వ నర్సింగ్...
By Krishna Balina 2026-01-18 09:47:31 0 559
Madhya Pradesh
Kuno National Park Welcomes Five New Cheetahs Into the Wild
Five more cheetahs flown in from Botswana have officially been released into the free-ranging...
By Dunna Jessicaruth 2026-05-18 07:09:51 0 68
Andhra Pradesh
ట్రిపుల్ ఐటీడీఎంలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే చివరి తేదీ!
ఏపీలోని కర్నూలు ట్రిపుల్ ఐటీలో నాన్ టీచింగ్ 16, టీచింగ్ 10 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించారు....
By Pagadala Venkateswar 2026-01-23 07:07:54 0 160
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com