Telugu University Dispute: తెలుగు వర్సిటీల మధ్య వివాదం.. ఏపీ వీసీకి తెలంగాణ లీగల్ నోటీసులు.

0
122

Telugu University Dispute: తెలుగు వర్సిటీల మధ్య వివాదం.. ఏపీ వీసీకి తెలంగాణ లీగల్ నోటీసులు

10-03-2026 Tue 08:22 | Both States

 

Muniratnam Naidu Responds to Telugu University Legal Dispute

ఏపీ తెలుగు వర్సిటీకి తెలంగాణ వర్సిటీ లీగల్ నోటీసు

సంగీత, నృత్య కళాశాలల పరీక్షల నోటిఫికేషన్‌పై అభ్యంతరం

విభజన పూర్తవనందున కాలేజీలు తమ పరిధిలోనే ఉన్నాయని తెలంగాణ వాదన

ప్రభుత్వం తరఫున సమాధానమిస్తామన్న ఏపీ వర్సిటీ వీసీ

ఇటీవలే తెలంగాణ వర్సిటీ పేరును 'సురవరం ప్రతాపరెడ్డి'గా మార్చిన వైనం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య మరో వివాదం తెరపైకి వచ్చింది. రాష్ట్ర విభజన జరిగి దశాబ్దం గడిచినా ఆస్తుల పంపకాలు ఇంకా పూర్తికాని నేపథ్యంలో రెండు రాష్ట్రాల తెలుగు విశ్వవిద్యాలయాల మధ్య న్యాయపోరాటం మొదలైంది. ఏపీలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి తెలంగాణలోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం లీగల్ నోటీసులు జారీ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

 

తమ ఆధీనంలో ఉన్న ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలలు, పాఠశాలల్లో ప్రవేశ పరీక్షల నిర్వహణకు ఏపీ వర్సిటీ నోటిఫికేషన్ ఇవ్వడమే ఈ వివాదానికి మూలకారణం. విద్యార్థుల నుంచి పరీక్ష ఫీజులు వసూలు చేయడాన్ని తెలంగాణ వర్సిటీ తీవ్రంగా తప్పుబట్టింది. రాష్ట్ర విభజన ప్రక్రియ ఇంకా పూర్తిగా కొలిక్కి రానందున విజయనగరం, గుంటూరు, నెల్లూరు, రాజమహేంద్రవరం, విజయవాడ, కర్నూలులోని ఈ కళాశాలలు, పాఠశాలలు చట్టపరంగా తమ పరిధిలోనే ఉన్నాయని తెలంగాణ వర్సిటీ వాదిస్తోంది. ఈ నేపథ్యంలో తమ పరిధిలోని సంస్థలకు పరీక్షలు నిర్వహించే అధికారం ఏపీ వర్సిటీకి లేదంటూ వీసీకి లీగల్ నోటీసులు పంపింది.

 

ఈ వివాదంపై ఏపీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మునిరత్నం నాయుడు స్పందించారు. తెలంగాణ వర్సిటీ నుంచి లీగల్ నోటీసులు అందిన మాట వాస్తవమేనని, దీనిపై ప్రభుత్వం తరఫున తగిన సమాధానం ఇస్తామని ఆయన వెల్లడించారు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తవడంతో తెలంగాణ వర్సిటీ ఏపీలో ప్రవేశాలు నిలిపివేసింది. దీంతో ఏపీ ప్రభుత్వం ఇక్కడ కొత్తగా తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసి, వీసీని నియమించింది.

 

కాగా, తెలంగాణ అస్తిత్వం, సంస్కృతిని ప్రతిబింబించేలా, అక్కడి తెలుగు విశ్వవిద్యాలయానికి 2024 జూన్ నెలలో రాష్ట్ర ప్రభుత్వం 'సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం'గా పేరు మార్చిన విషయం తెలిసిందే. తెలంగాణ వైతాళికుడు, సామాజిక సంస్కర్త, గోల్కొండ పత్రిక వ్యవస్థాపకుడైన సురవరం ప్రతాపరెడ్డికి గౌరవ సూచకంగా ఈ మార్పు చేశారు. ప్రస్తుతం ఈ రెండు వర్సిటీల మధ్య నెలకొన్న న్యాయపోరాటం ఎలాంటి మలుపు తీసుకుంటుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Search
Categories
Read More
Telangana
ఆర్టీసీపై కాంగ్రెస్ కుట్రలు.. ఎవడబ్బ జాగీరు అని డిపోలను ధారాదత్తం చేస్తారు?: తలసాని నిప్పులు.|
సికింద్రాబాద్ : తొంభై ఏళ్లకు పైగా ఘన చరిత్ర కలిగిన ఆర్టీసీ మనుగడకు కాంగ్రెస్ ప్రభుత్వం ముప్పు...
By Sidhu Maroju 2026-04-23 06:27:43 0 200
Andhra Pradesh
అంగన్వాడీ వర్కర్లు,హెల్పర్ల కి కనీసవేతనాలు అమలుచేయాలి..
బాపట్ల: అంగన్వాడీ వర్కర్లు,హెల్పర్ల కి కనీసవేతనాలు అమలుచేయాలి, దేశవ్యాప్తంగా బడ్జెట్ పెంపుదల...
By Gadiyapudi Narendra 2026-02-03 16:04:03 0 257
Andhra Pradesh
గాలిబ్ షాహిద్ దర్గా భూములు కాపాడండి
*ఖిల్లా హజరత్ గాలిబ్ షహీద్ దర్గా భూములు కాపాడండి*   *అల్తాఫ్ బాబాకు దర్గా ముజావర్ల వినతి...
By Rajini Kumari 2026-03-28 14:12:21 0 172
Andhra Pradesh
రైతు పొలంలో పైపులైన్లు, స్ప్రింకర్ల ధ్వంసం – ఎస్ఐకి ఫిర్యాదు.
చిత్తూరు జిల్లా నిమ్మనపల్లి మండలంలోని రెడ్డివారిపల్లి గ్రామంలో రైతు టి. కుమార్ పొలంలో అమర్చిన...
By Pagadala Venkateswar 2026-02-03 12:39:05 0 116
Telangana
ప్రభుత్వ భూములు విక్రయించనున్న తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్ – రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయ్‌దుర్గ్ పరిధిలోని నాలెడ్జ్...
By Sidhu Maroju 2025-10-16 07:51:38 0 256
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com