AP Teachers: ఏపీ టీచర్లకు డబుల్ గుడ్ న్యూస్.. కేసుల ఎత్తివేతతో పాటు హాజరులో మినహాయింపు.

0
149

 

AP Teachers: ఏపీ టీచర్లకు డబుల్ గుడ్ న్యూస్.. కేసుల ఎత్తివేతతో పాటు హాజరులో మినహాయింపు

10-03-2026 Tue 08:06 | Andhra

 

AP Teachers Get Double Good News Cases Withdrawal Attendance Exemption

సీఎం క్యాంపు కార్యాలయ ముట్టడి కేసుల ఉపసంహరణకు ప్రభుత్వం నిర్ణయం

2022లో సీపీఎస్ రద్దు కోరుతూ నిరసన తెలిపిన 73 మంది ఉపాధ్యాయులకు ఊరట

అంధ ఉపాధ్యాయులకు ఫేస్ రికగ్నిషన్ హాజరు నుంచి మినహాయింపు

ప్రధానోపాధ్యాయులు లీప్ యాప్‌లో వీరి హాజరు నమోదు చేయాలని ఆదేశం

ఏపీలోని ప్రభుత్వ ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి రెండు శుభవార్తలు అందించింది. గత ప్రభుత్వ హయాంలో వారిపై నమోదైన కేసులను ఎత్తివేయడంతో పాటు, అంధ ఉపాధ్యాయులకు హాజరు నిబంధనల్లో కీలక మినహాయింపు ఇచ్చింది. ఈ మేరకు హోం శాఖ, పాఠశాల విద్యాశాఖ వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశాయి. ప్రభుత్వ నిర్ణయంతో ఉపాధ్యాయ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.

 

వివరాల్లోకి వెళితే.. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ (యూటీఎఫ్) ఆధ్వర్యంలో 2022 ఏప్రిల్ 25న ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద సమావేశమైన ఉపాధ్యాయులను పోలీసులు అడ్డుకున్నారు. నిరసనకు అనుమతి లేదన్న కారణంతో విజయవాడ గవర్నర్‌పేట పోలీస్ స్టేషన్‌లో మొత్తం 73 మంది ఉపాధ్యాయులపై కేసు నమోదు చేశారు. తాజాగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ కేసును ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. కోర్టులో కేసు ఉపసంహరణకు పిటిషన్ దాఖలు చేసేందుకు అనుమతిస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో రెండేళ్లుగా ఆందోళనలో ఉన్న ఉపాధ్యాయులకు భారీ ఊరట లభించినట్లయింది.

 

అంధ ఉపాధ్యాయుల‌కు ప్రభుత్వం మరో ఊరట

ఇదే సమయంలో అంధ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి ప్రభుత్వం మరో ఊరట కల్పించింది. పాఠశాలల్లో అమలు చేస్తున్న ముఖ ఆధారిత హాజరు (ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్) విధానం నుంచి వారికి మినహాయింపు ఇస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ పరిధిలోని దృష్టిలోపం గల ఉపాధ్యాయులు, సిబ్బంది హాజరును "లీప్" (LEAP) యాప్‌లో నేరుగా నమోదు చేయాలని ఆదేశించారు. ఈ రెండు నిర్ణయాలు ఉపాధ్యాయుల పట్ల కొత్త ప్రభుత్వ సానుకూల వైఖరిని సూచిస్తున్నాయని ఉపాధ్యాయ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి

Search
Categories
Read More
Andhra Pradesh
అనంతపురం గంగమ్మ తల్లికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి గారి సోదరుడు
ఈరోజు మొదలైన రాయలసీమకే తలమానికమైన అనంతపురం గంగమ్మ అమ్మవారి కి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు...
By Benguluri Madhubabu 2026-02-18 14:21:01 0 251
Telangana
హైజెనిక్ అండ్ ఆర్గానిక్ సానిటరీ ప్యాడ్స్ ఉచిత పంపిణీ. బాలికలకు అవగాహన కార్యక్రమం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ లోని ప్రభుత్వ ఉన్నత బాలికల పాఠశాలలో వివిఆర్ గ్రూప్స్ వాగ్మిక...
By Sidhu Maroju 2025-12-07 06:55:57 0 275
Andhra Pradesh
100 రోజుల ప్రణాళిక,!! సెట్కూర్ CEO
కర్నూలు : వంద రోజుల ప్రణాళిక అమలు కావాలి: సెట్కూరు సీఈఓ.. కలెక్టర్ ఆదేశాల మేరకు ఎస్ఏపీ క్యాంప్...
By Hari Krishna 2025-12-21 14:02:53 0 194
Andhra Pradesh
ఓబన్న ఆయన త్యాగాలు తరతరాలు చాటాలి మాజీ ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు
రేనాటి పోరాటానికి ప్రతీక వడ్డే ఓబన్న.. ఆయన త్యాగాలు తరతరాలకు చాటాలి   టిడిపి నేత, మాజీ...
By Rajini Kumari 2026-01-11 09:42:32 0 190
Telangana
11వ వార్డు వర్ష బాధితులకు కౌన్సిలర్ కార్తీక్ అండ
🎤కొమురం భీం భారత్ ఆవాజ్, ప్రతినిధి జగదీష్ నిన్న రాత్రి కురిసిన భారీ వర్షాలకు ఆసిఫాబాద్...
By Chunarkar Jagadeesh 2026-06-30 07:03:32 0 182
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com