అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా పోలీసులకు ఘన సన్మానం

0
138

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా పోలీసులకు ఘన సన్మానం

 

గోదావరిఖని ఏసీపీ కార్యాలయంలో మహిళా సిబ్బందితో వేడుకలు – మహిళల సేవలు అభినందనీయం: ఏసీపీ ఎం.రమేష్

 

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గోదావరిఖని ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ ఎం. రమేష్ పోలీస్ అధికారులతో కలిసి మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా పోలీస్ అధికారులు, సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసి వేడుకలను జరుపుకున్నారు. అనంతరం మహిళా పోలీస్ అధికారులు, సిబ్బందిని శాలువాలతో ఘనంగా సన్మానించారు.

 

ఈ సందర్భంగా ఏసీపీ ఎం. రమేష్ మాట్లాడుతూ, మహిళల్లో సంకల్పశక్తి ఎక్కువగా ఉంటుందని, వారు ఏ రంగంలోనైనా గొప్ప విజయాలు సాధించగలరని అన్నారు. దేశంలోని అన్ని రంగాల్లో మహిళలు ఉన్నత స్థానాలకు చేరుకుంటూ పురుషులతో సమానంగా రాణిస్తున్నారని పేర్కొన్నారు. మహిళలకు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో హక్కులు ఉన్నాయని తెలిపారు.

 

మహిళా అధికారులు తమ పూర్తి శక్తి, సామర్థ్యాలతో విధులు నిర్వహిస్తూ తమ లక్ష్యాలను సాధించేందుకు నిరంతరం కృషి చేయాలని సూచించారు. పురుషుల కంటే మహిళల్లో నిబద్ధత ఎక్కువగా ఉంటుందని, పలు విభాగాల్లో మహిళా పోలీస్ అధికారులు, సిబ్బంది సమర్థవంతంగా సేవలందిస్తున్నారని తెలిపారు.

 

పోలీస్ స్టేషన్లలో రిసెప్షన్ విధులు, కోర్టు డ్యూటీ ఆఫీసర్, రైటర్, పెట్రోలింగ్, బ్లూ కోట్స్, సైబర్ వారియర్స్, పాఠశాలలు మరియు కళాశాలల్లో షీ టీమ్స్ ద్వారా సైబర్ క్రైమ్‌లపై అవగాహన కార్యక్రమాలు, ముఖ్యమైన బందోబస్త్ బాధ్యతలను మహిళా పోలీస్ అధికారులు, సిబ్బంది సమర్థంగా నిర్వహిస్తున్నారని అన్నారు. గృహహింస, వైవాహిక వివాదాల వంటి కేసుల్లో బాధిత మహిళలకు కౌన్సెలింగ్ అందిస్తూ మహిళా పోలీస్ అధికారులు, సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని అభినందించారు.

 

మహిళలు పలు రంగాల్లో సాధిస్తున్న విజయాలు రాబోయే తరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్న ఏసీపీ, మహిళా అధికారులు ధైర్యంగా ఉండి తమ వృత్తిపరమైన బాధ్యతలను గౌరవంగా నిర్వహించాలని సూచించారు. మహిళా పోలీస్ సిబ్బంది సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు.

 

ఈ కార్యక్రమంలో గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, గోదావరిఖని టూ టౌన్ ఇన్స్పెక్టర్ ప్రసాదరావు, రామగుండం ఎస్సై సంధ్యారాణి, రామగిరి ఎస్సై దివ్య, గోదావరిఖని వన్ టౌన్ ఎస్సై అనూష, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఇసుక క్వారీపై ధ్వజమెత్తిన టీ సుండుపల్లె మండలం రైతులు
ఈరోజు టి సుండు పల్లి మండలంలో పెద్దబలిజ పల్లి గ్రామం గుట్టకాడపల్లి మల్లక్క గారి పల్లి ఏటిగడ్డ...
By Benguluri Madhubabu 2026-03-22 07:34:19 0 153
Andhra Pradesh
పుంగనూరు: పుంగునూరు పట్టణంలో ఇంటర్ ఇన్విజిలేటర్ తొలగింపు
పుంగనూరు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లిష్ పేపర్...
By Kothuru Murali 2026-02-26 12:46:07 0 70
Andhra Pradesh
AP Teachers: ఏపీ టీచర్లకు కొత్త అటెండెన్స్ రూల్స్.. ఇక నిమిషం ఆలస్యమైనా 'లేట్'.
ఉదయం 9 గంటలలోపు పాఠశాలలకు హాజరు తప్పనిసరి హాఫ్-డే లీవులు, ఔట్-టైమ్‌పైనా కఠినమైన రూల్స్ జారీ...
By Pagadala Venkateswar 2026-03-02 03:29:41 0 113
Andhra Pradesh
రాజధాని కార్మిక వాడల్లో డిసెంబర్ 15న ఎర్రజెండాల ఆవిష్కరణ
*ఉండవల్లిలో మున్సిపల్ కార్మికులను ఉద్దేశించి శనివారం నాడు మాట్లాడుతున్న సిఐటియు గుంటూరు జిల్లా...
By Rajini Kumari 2025-12-13 09:59:44 0 197
Andhra Pradesh
ఆరోగ్యం కాలుష్యరహిత భవితకు సైకిల్ సవారి జిల్లా కలెక్టర్DG లక్ష్మీశ
*పత్రికా ప్రకటన* *ఎన్టీఆర్ జిల్లా, డిసెంబ‌ర్ 28, 2025*   *ఆరోగ్యం, కాలుష్య...
By Rajini Kumari 2025-12-28 09:51:47 0 111
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com