AP SSC: ఏపీలో నేటి నుంచి పదో తరగతి హాల్ టికెట్ల జారీ.

0
142

AP SSC: ఏపీలో నేటి నుంచి పదో తరగతి హాల్ టికెట్ల జారీ

05-03-2026 Thu 14:58 | Andhra

 

AP SSC Hall Tickets Released Today

నేడు ఉదయం 11 గంటలకు పదో తరగతి హాల్ టికెట్ల విడుదల

మార్చి 16 నుంచి ప్రారంభం కానున్న పబ్లిక్ పరీక్షలు

వెబ్‌సైట్‌తో పాటు వాట్సాప్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు

పేరు, పుట్టిన తేదీ వివరాలతో హాల్ టికెట్ పొందే అవకాశం

ప్రైవేట్ వెబ్‌సైట్లను నమ్మొద్దని అధికారుల సూచన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులకు కీలక అలర్ట్. రాష్ట్రంలో మార్చి 16 నుంచి జరగనున్న టెన్త్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించి నేడు (మార్చి 5) ఉదయం 11 గంటలకు హాల్ టికెట్లు విడుదల చేశారు. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు కె.వి. శ్రీనివాసులురెడ్డి తెలిపారు. పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులు నేటి నుంచి తమ హాల్ టికెట్లను ఆన్‌లైన్ ద్వారా పొందవచ్చు.

 

విద్యార్థులు తమ హాల్ టికెట్లను బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సాంకేతికతను మరింత అందుబాటులోకి తెస్తూ.. ఈసారి 'మన మిత్ర' వాట్సాప్ నంబర్ 95523 00009 కు మెసేజ్ చేయడం ద్వారా లేదా పాఠశాల విద్యాశాఖకు చెందిన 'లీప్' (LEAP) యాప్ ద్వారా కూడా సులభంగా హాల్ టికెట్లు పొందే వెసులుబాటు కల్పించారు. వెబ్‌సైట్‌లో జిల్లా, పాఠశాల పేరు, విద్యార్థి పేరు, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేసి హాల్ టికెట్ ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది.

 

హాల్ టికెట్ల జారీకి సంబంధించి బోర్డు ఎటువంటి ప్రైవేటు ఏజెన్సీలకు గానీ, థర్డ్ పార్టీ వెబ్‌సైట్లకు గానీ అనుమతి ఇవ్వలేదని అధికారులు స్పష్టం చేశారు. కేవలం అధికారిక మార్గాలను మాత్రమే ఎంచుకోవాలని, అనధికారిక లింకులను నమ్మవద్దని సూచించారు. హాల్ టికెట్లలో ఏవైనా తప్పులు ఉన్నా, సందేహాలు ఉన్నా వెంటనే సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులను సంప్రదించాలని విద్యార్థులకు, తల్లిదండ్రులకు అధికారులు సూచించారు. మార్చి 16 నుంచి పరీక్షలు మొదలుకానున్న నేపథ్యంలో విద్యార్థులు ముందుగానే హాల్ టికెట్లు తీసుకుని సిద్ధంగా ఉండాలని కోరారు.

Search
Categories
Read More
Telangana
దస్తూరాబాద్లో యూరియా కొరత లేదు: ఏవో
దస్తూరాబాద్ మండలంలో యూరియా కొరత లేదని మండల వ్యవసాయ అధికారిణి మానస అన్నారు.   మున్యాల...
By Mitappaly Shiavji 2025-12-31 02:15:24 0 537
Telangana
"ఈటల రాజేందర్ పిలుపు.. మోదీ సభకు గజ్వేల్ నుంచి భారీ సమీకరణ.|
సిద్దిపేట జిల్లా: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో మే 10న జరగనున్న ప్రధాని నరేంద్ర మోదీ భారీ...
By Sidhu Maroju 2026-05-05 11:38:53 0 295
Chhattisgarh
Chhattisgarh's Industrial Growth and Investment Drive
Chhattisgarh continues to strengthen its position as an emerging industrial hub through strategic...
By Fathima Safa 2026-06-24 07:45:10 0 94
Andhra Pradesh
పుంగనూరు: నెల్లి చెట్ల ఏరియాలో తిష్ట వేసిన 14 ఏనుగులు
పుంగనూరు నియోజకవర్గం, పులిచర్ల మండలంలో పంటలను ధ్వంసం చేసిన 14 ఏనుగుల గుంపు శనివారం రాత్రి నుంచి...
By Kothuru Murali 2026-04-06 07:08:21 0 161
Telangana
ఖాళీగా ఉన్న ఫీలింగ్ స్టేషన్....
దుగ్గొండి మండలానికి చెందిన స్నేహ సాయి ఫీలింగ్ స్టేషన్లో మూడు రోజుల నుండి పెట్రోల్ మరియు డీజిల్...
By Gujile Ramu 2026-04-25 13:55:18 0 157
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com