రాల మసీద్ సెంటర్‌లో ప్రమాదకర డ్రైనేజీ మ్యాన్‌హోల్,, అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆందోళన

0
191

 చీరాల:  చీరాల పట్టణంలోని మసీద్ సెంటర్ ప్రాంతంలో ప్రధాన రహదారిపై ఉన్న డ్రైనేజీ మ్యాన్‌హోల్‌లో ప్రమాదవశాత్తు మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి జారి పడిన ఘటన చోటుచేసుకుంది. అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం తప్పినప్పటికీ, ఈ సంఘటన స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది.
ఈ మ్యాన్‌హోల్ ప్రమాదకరంగా ఉన్నదని గత నెలలోనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. చుట్టూ రక్షణ గోడ లేదా ఇనుప కంచె ఏర్పాటు చేయాలని, ఆ ప్రదేశంలో మద్యం సేవించే వ్యక్తులు, రిక్షా కార్మికులు, ఆటో డ్రైవర్లు కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నారని, ఎప్పుడైనా అనుకోని ప్రమాదం సంభవించే అవకాశం ఉందని ముందుగానే హెచ్చరించినట్లు చెప్పారు.
అయినప్పటికీ సంబంధిత అధికారులు స్పందించకపోవడం పట్ల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి హెచ్చరికలను బాధ్యతగా తీసుకుని తక్షణమే తగిన భద్రతా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని చీరాల నగర ప్రజలు కోరుతున్నారు. ఇకనైనా అధికారులు నిర్లక్ష్య ధోరణిని విడిచిపెట్టి, ప్రమాదకర ప్రదేశాల్లో భద్రతా ఏర్పాట్లు చేసి ప్రజల ప్రాణాలను కాపాడాల  చీరాల పట్టణంలోని మసీద్ సెంటర్ ప్రాంతంలో ప్రధాన రహదారిపై ఉన్న డ్రైనేజీ మ్యాన్‌హోల్‌లో ప్రమాదవశాత్తు మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి జారి పడిన ఘటన చోటుచేసుకుంది. అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం తప్పినప్పటికీ, ఈ సంఘటన స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది.
ఈ మ్యాన్‌హోల్ ప్రమాదకరంగా ఉన్నదని గత నెలలోనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. చుట్టూ రక్షణ గోడ లేదా ఇనుప కంచె ఏర్పాటు చేయాలని, ఆ ప్రదేశంలో మద్యం సేవించే వ్యక్తులు, రిక్షా కార్మికులు, ఆటో డ్రైవర్లు కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నారని, ఎప్పుడైనా అనుకోని ప్రమాదం సంభవించే అవకాశం ఉందని ముందుగానే హెచ్చరించినట్లు చెప్పారు.
అయినప్పటికీ సంబంధిత అధికారులు స్పందించకపోవడం పట్ల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి హెచ్చరికలను బాధ్యతగా తీసుకుని తక్షణమే తగిన భద్రతా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని చీరాల నగర ప్రజలు కోరుతున్నారు. ఇకనైనా అధికారులు నిర్లక్ష్య ధోరణిని విడిచిపెట్టి, ప్రమాదకర ప్రదేశాల్లో భద్రతా ఏర్పాట్లు చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని

 

#Narendra

Search
Categories
Read More
Andhra Pradesh
“ఏపీ ప్రజల్లో నమ్మకం తగ్గుతోందా?”
ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు ప్రభుత్వ వ్యవస్థలు, రాజకీయ నాయకులు, ఉద్యోగ అవకాశాలపై క్రమంగా నమ్మకం...
By Babitha Babitha 2026-05-16 07:13:28 0 71
Andhra Pradesh
రాష్ట్రానికి పెట్టుబడుల వరద.. రూ. 2 లక్షల కోట్ల ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం!
నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం రూ. 2.01 లక్షల కోట్ల విలువైన 25 ప్రాజెక్టులకు...
By Pagadala Venkateswar 2026-05-14 06:08:51 0 59
Andhra Pradesh
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు: 8 మందికి రూ.10 వేల చొప్పున జరిమానా
చీరాల: చీరాల ఒకటో పట్టణ ట్రాఫిక్ ఇంచార్జి ఎస్సై పవన్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి డ్రంక్ అండ్...
By Gadiyapudi Narendra 2026-02-07 17:30:15 0 143
Andhra Pradesh
మదనపల్లి: సమిష్టి కృషితో జలధార విజయం – కలెక్టర్.
మంగళవారం మదనపల్లిలో జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ, జలధార ప్రాజెక్టు...
By Pagadala Venkateswar 2026-04-01 04:49:40 0 125
Andhra Pradesh
వాట్సాప్ గవర్నెన్స్ మన మిత్ర ద్వారా FIR డౌన్లోడ్: కర్నూలు ఎస్పీ
కర్నూలు : కర్నూలు జిల్లా :  హాయ్ అంటేFIR కాపీవాట్సాప్ గవర్నెన్స్ ‘మన మిత్ర’లో...
By Hari Krishna 2026-01-17 11:43:49 0 279
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com