రాల మసీద్ సెంటర్‌లో ప్రమాదకర డ్రైనేజీ మ్యాన్‌హోల్,, అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆందోళన

0
133

 చీరాల:  చీరాల పట్టణంలోని మసీద్ సెంటర్ ప్రాంతంలో ప్రధాన రహదారిపై ఉన్న డ్రైనేజీ మ్యాన్‌హోల్‌లో ప్రమాదవశాత్తు మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి జారి పడిన ఘటన చోటుచేసుకుంది. అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం తప్పినప్పటికీ, ఈ సంఘటన స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది.
ఈ మ్యాన్‌హోల్ ప్రమాదకరంగా ఉన్నదని గత నెలలోనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. చుట్టూ రక్షణ గోడ లేదా ఇనుప కంచె ఏర్పాటు చేయాలని, ఆ ప్రదేశంలో మద్యం సేవించే వ్యక్తులు, రిక్షా కార్మికులు, ఆటో డ్రైవర్లు కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నారని, ఎప్పుడైనా అనుకోని ప్రమాదం సంభవించే అవకాశం ఉందని ముందుగానే హెచ్చరించినట్లు చెప్పారు.
అయినప్పటికీ సంబంధిత అధికారులు స్పందించకపోవడం పట్ల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి హెచ్చరికలను బాధ్యతగా తీసుకుని తక్షణమే తగిన భద్రతా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని చీరాల నగర ప్రజలు కోరుతున్నారు. ఇకనైనా అధికారులు నిర్లక్ష్య ధోరణిని విడిచిపెట్టి, ప్రమాదకర ప్రదేశాల్లో భద్రతా ఏర్పాట్లు చేసి ప్రజల ప్రాణాలను కాపాడాల  చీరాల పట్టణంలోని మసీద్ సెంటర్ ప్రాంతంలో ప్రధాన రహదారిపై ఉన్న డ్రైనేజీ మ్యాన్‌హోల్‌లో ప్రమాదవశాత్తు మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి జారి పడిన ఘటన చోటుచేసుకుంది. అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం తప్పినప్పటికీ, ఈ సంఘటన స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది.
ఈ మ్యాన్‌హోల్ ప్రమాదకరంగా ఉన్నదని గత నెలలోనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. చుట్టూ రక్షణ గోడ లేదా ఇనుప కంచె ఏర్పాటు చేయాలని, ఆ ప్రదేశంలో మద్యం సేవించే వ్యక్తులు, రిక్షా కార్మికులు, ఆటో డ్రైవర్లు కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నారని, ఎప్పుడైనా అనుకోని ప్రమాదం సంభవించే అవకాశం ఉందని ముందుగానే హెచ్చరించినట్లు చెప్పారు.
అయినప్పటికీ సంబంధిత అధికారులు స్పందించకపోవడం పట్ల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి హెచ్చరికలను బాధ్యతగా తీసుకుని తక్షణమే తగిన భద్రతా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని చీరాల నగర ప్రజలు కోరుతున్నారు. ఇకనైనా అధికారులు నిర్లక్ష్య ధోరణిని విడిచిపెట్టి, ప్రమాదకర ప్రదేశాల్లో భద్రతా ఏర్పాట్లు చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని

 

#Narendra

Search
Categories
Read More
Telangana
జీహెచ్ఎంసీకి రికార్డు ఆదాయం.. రూ.1,172 కోట్లు!
హైదరాబాద్: 2025-26 ఆర్థిక సంవత్సరంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఆదాయం...
By Sidhu Maroju 2026-04-03 18:05:05 0 103
Telangana
రెడ్డి శ్రీను ముదిరాజ్ గోకాఫసల్వాడ్
కోడంగల్ ను దేశంలోనే ఒక ఆదర్శ నియోజకవర్గంగ రోల్ మోడల్ గ తీర్చిదిద్దుతా   తెలంగాణలో 12,706...
By Vanmoj Suryamohan 2025-12-24 16:40:33 1 441
Andhra Pradesh
మదనపల్లి కిడ్నీ రాకెట్ కేసులో మరో నిందితుడు అరెస్ట్: డీఎస్పీ.
మదనపల్లిలో సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు మరో నిందితుడిని అరెస్టు చేశారు....
By Pagadala Venkateswar 2026-02-15 05:47:35 0 109
Andhra Pradesh
Ram Prasad Reddy: ఏపీకి త్వరలో 750 ఎలక్ట్రిక్ బస్సులు: మంత్రి రాంప్రసాద్ రెడ్డి.
Ram Prasad Reddy: ఏపీకి త్వరలో 750 ఎలక్ట్రిక్ బస్సులు: మంత్రి రాంప్రసాద్ రెడ్డి 29-01-2026 Thu...
By Pagadala Venkateswar 2026-01-29 06:22:55 0 96
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com