TTD: తిరుమలలో పట్టు శాలువాల స్కామ్ ఎఫెక్ట్.. టీటీడీ కీలక నిర్ణయం.

0
104

ఆప్కో, కోఆప్టెక్స్‌ల నుంచి వస్త్రాలు కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్

రూ.43 కోట్ల విలువైన వస్త్రాలను 50:50 నిష్పత్తిలో సేకరణ

సరఫరాలో అంతరాయం లేకుండా మల్టీ వెండార్ విధానం అమలు

కొనుగోళ్లలో పారదర్శకత, నాణ్యతకు పెద్దపీట వేసిన టీటీడీ

 

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వస్త్రాల కొనుగోలు విధానంలో కీల‌క‌ నిర్ణయం తీసుకుంది. గతేడాది వెలుగులోకి వచ్చిన పట్టు శాలువాల కుంభకోణం నేపథ్యంలో ఇకపై కొనుగోళ్లలో పూర్తి పారదర్శకత పాటించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థలైన ఆప్కో (ఆంధ్రప్రదేశ్), కోఆప్టెక్స్ (తమిళనాడు) నుంచి వస్త్రాలను సేకరించాలని తీర్మానించింది. మొత్తం రూ.43 కోట్ల విలువైన చీరలు, శాలువాలు, ఇతర వస్త్ర సామగ్రిని ఈ రెండు సంస్థల నుంచి 50:50 నిష్పత్తిలో కొనుగోలు చేయనుంది.

 

సరఫరాలో ఎలాంటి అంతరాయాలు లేదా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకే ఈ మల్టీ వెండార్ విధానాన్ని ఎంచుకున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది. టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి ఇటీవల ఆప్కో, కోఆప్టెక్స్ ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమై చర్చలు జరిపారు. టీటీడీ నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలతో వస్త్రాలను సరఫరా చేసేందుకు ఈ రెండు సంస్థలు అంగీకారం తెలిపాయి. ఈ నిర్ణయంతో ఇకపై స్వామివారికి, అమ్మవార్లకు అవసరమైన వస్త్రాలన్నీ ప్రభుత్వ ఆధ్వర్యంలోని చేనేత సహకార సంఘాల నుంచే రానున్నాయి.

 

 

 

గతేడాది టీటీడీలో పట్టు శాలువాల కుంభకోణం తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. మల్బరీ పట్టు శాలువాల కోసం ఆర్డర్ ఇస్తే, ఓ ప్రైవేట్ సరఫరాదారు వాటికి బదులుగా నాసిరకం పాలిస్టర్ శాలువాలను సరఫరా చేసినట్లు టీటీడీ గుర్తించింది. సుమారు రూ.350 నుంచి రూ.400 విలువ చేసే శాలువాను ఏకంగా రూ.1,389 చొప్పున 2015 నుంచి కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై టీటీడీ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి ఫిర్యాదు చేయడంతో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే టీటీడీ భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లకు తావు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది.

 

 

 

కాగా, టీటీడీకి ఏటా భారీ మొత్తంలో వస్త్రాలు అవసరమవుతాయి. తిరుమల శ్రీవారి ఆలయానికి ఏటా దాదాపు 65 స్వచ్ఛమైన జరీ మేల్‌చాట్, ఉత్తరీయం సెట్లు, 1,080 పట్టు చీరలు అవసరం. అలాగే టీటీడీ పరిధిలోని ఇతర ఆలయాలకు 320 మేల్‌చాట్ సెట్లు, వందల సంఖ్యలో పట్టు చీరలు కావాలి. వీటికి అదనంగా ఏటా 36 వేల పట్టు శాలువాలు, 60 వేల పాలిస్టర్ శాలువాలు, 10.8 లక్షల కాటన్ వస్త్రాలు, 9 లక్షల కాటన్ బ్లౌజ్ పీసులు కూడా టీటీడీ సేకరిస్తుంది. ఈ భారీ అవసరాలన్నింటినీ ఇకపై ఆప్కో, కోఆప్టెక్స్‌లు సంయుక్తంగా తీర్చనున్నాయి.

Search
Categories
Read More
Andhra Pradesh
ఇబ్రహీంపట్నంలో వరుస బైకుల దొంగతనాలు
ఇబ్రహీంపట్నం లో వరుస ద్విచక్ర వాహనాల దొంగతనాలు.....   పోలీసులకే తలనొప్పిగా మారిన దొంగల...
By Rajini Kumari 2026-01-16 12:54:57 0 164
Andhra Pradesh
జగన్మోహన్ రెడ్డి మావిగన్ జోకర్ వైయస్ షర్మిల రెడ్డి
BREAKING   విజయవాడ    *జగన్ మోహన్ రెడ్డి “మావిగన్ జోకర్” - వైఎస్...
By Rajini Kumari 2026-04-10 06:36:44 0 96
Andhra Pradesh
ఎంపీ శివనాద్ కార్యాలయంలో రెటంపల్లి శ్యామ్ కి సన్మానం
*ప్ర‌చుర‌ణార్థం* *05-03-2026*   *కష్టపడి పనిచేసే వారికి టిడిపిలో గుర్తింపు...
By Rajini Kumari 2026-03-06 01:50:15 0 145
Andhra Pradesh
చీరాల పరిసర ప్రాంతాల పెట్రోల్ బంకుల్లో నిబంధనల ఉల్లంఘన … ప్రమాదాలకు ఆహ్వానం పలుకుతున్న సెల్‌ఫోన్ వినియోగం
చీరాల: చీరాల పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లోని పలు పెట్రోల్ బంకుల్లో నిబంధనలకు విరుద్ధంగా...
By Gadiyapudi Narendra 2026-02-12 17:18:31 0 136
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com