లోతుకుంటలో సందడిగా బాక్స్ క్రికెట్ టోర్నీ ముగింపు వేడుకలు.|

0
159

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  : లోతుకుంట లక్ష్మీ కళ మందిర్ థియేటర్ ఎదురుగా నిర్వాహకుడు కంది కంటి యశ్వంత్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కె.ఆర్.జి (లేట్ కందికంటి రవికుమార్ గౌడ్)  మెమోరియల్ తొలి బాక్స్ క్రికెట్ టోర్నమెంట్ క్లోజింగ్ సెర్మనీ కార్యక్రమం ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి మల్కాజ్‌గిరి శాసనసభ్యులు  మర్రి రాజశేఖర్ రెడ్డి  ముఖ్య అతిథిగా హాజరై, బాక్స్ క్రికెట్ మ్యాచ్‌లను తిలకించడంతో పాటు స్వయంగా క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ, యువత క్రీడల వైపు మొగ్గు చూపడం శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఇలాంటి క్రీడా కార్యక్రమాలు యువతలో క్రమశిక్షణ, ఐక్యత, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని అన్నారు.

అలాగే లేట్ కందికంటి రవికుమార్ గౌడ్  స్మృతిలో నిర్వహించిన ఈ టోర్నమెంట్ అభినందనీయమని, క్రీడల ద్వారా వారి జ్ఞాపకాన్ని నిలుపుకోవడం గొప్ప విషయమని ఎమ్మెల్యే  తెలిపారు. విజేతలకు మరియు పాల్గొన్న క్రీడాకారులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో అల్వాల్ కార్పొరేటర్  శాంతి శ్రీనివాస్ రెడ్డి గారు, టీఆర్‌ఎస్ నాయకులు శ్రీ అనిల్ కిషోర్ గౌడ్, నేమూరి శ్రీధర్ గౌడ్, అరుణ్ రావు, బీఆర్ఎస్ నాయకులు, క్రీడాకారులు, యువకులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

#sidhumaroju

Search
Categories
Read More
Telangana
భీమ్ రావ్ నగర్ లో డ్రైనేజీ పైప్ పనులను పరిశీలించిన మాజీ కార్పొరేటర్ .|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : భీమ్ రావు నగర్ లో ప్రస్తుతం కొనసాగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ...
By Sidhu Maroju 2026-02-27 12:34:40 0 151
Telangana
*మహిళా సంఘాల ఆధ్వర్యంలో మండల సర్పంచుల ఫోరం అధ్యక్షురాలు మన్నెంపల్లి సర్పంచ్ పొన్నం సునీత అనీల్ గౌడ్ గారికీ ఘనంగా సన్మానం*
ఈరోజు తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామంలోని మహిళా సంఘం ల ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన *సర్పంచ్...
By Bouth Arun 2025-12-30 02:51:18 0 425
Andhra Pradesh
2026 నూతన సంవత్సరంలో రాబోతున్న కొత్త మార్పులు.! జనవరి 1 నుండి అమల్లోకి రానున్న కొత్త రూల్స్ ఇవే..!!
కొత్త సంవత్సరం అంటే కేవలం క్యాలెండర్ మారడం మాత్రమే కాదు; ప్రజల దైనందిన జీవితంలో కూడా అనేక...
By John Baji 2025-12-29 13:11:40 0 316
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com