వేట్లపాలెం ప్రమాద బాధితులకు ఆర్థిక సహాయం పంపిణీ

0
429

సామర్లకోట మండలం వేట్లపాలెం బాణాసంచా ప్రమాద బాధిత కుటుంబాలకు డీఎస్సీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు ఆర్థిక సహాయం అందించారు. ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు.

బాధిత కుటుంబాలను పరామర్శించిన ఆయన, ఈ క్లిష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని వారికి సూచించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం మరియు ప్రజాప్రతినిధులు బాధితులకు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు.

ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు అందించిన ఈ సహాయం కొంతైనా ఉపశమనం కలిగిస్తుందని స్థానికులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తానయుడు నిమ్మకాయల రంగనాగ్, రైస్ మిల్లర్స్ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
బాల్య వివాహాలు - చట్ట విరుద్ధం :విశాఖ అధికారులు వెల్లడి
బాల్య వివాహాలు అంటే 18 లేదా 21సంవత్స రములు రాక మునుపు చేస్తే వివాహాలను బాల్య వివాహాలు అంటారు. ఐతే...
By Mobbu Venkatramana 2026-02-25 14:08:18 0 179
Andhra Pradesh
23వ తారీకు విజయవాడ ఇంద్రకీలాద్రిపై వసంత పంచమి సందర్భంగా సరస్వతి దేవిగా దర్శనం ఇవ్వనున్న అమ్మవారు
ప్రకటన   విషయం: రేపు తేది 23.01.2026న శ్రీ పంచమి పురస్కరించుకుని శ్రీ కనక దుర్గ అమ్మవారు...
By Rajini Kumari 2026-01-22 12:27:23 0 143
International
International women's day
అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు మహిళలందరికీ హృదయ...
By G k Nookala 2026-03-08 05:19:10 0 79
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com