C M Revanth reddy meets Amith Shah in Delhi

0
252

తెలంగాణ రాష్ట్ర అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఐపీఎస్ అధికారుల సంఖ్య‌ను కేటాయించాల‌ని కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారికి ముఖ్య‌మంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు విజ్ఞ‌ప్తి చేశారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి గారు కేంద్ర హోం శాఖ మంత్రి గారితో భేటీ అయ్యారు. 

 

✅ రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం 2016లో మొద‌టి క్యాడ‌ర్ రివ్యూ జ‌రిగింద‌ని, 2021లో జ‌ర‌గాల్సిన క్యాడ‌ర్ రివ్యూ చాలా ఆల‌స్యంగా 2025లో జ‌రిగింద‌ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు గుర్తుచేశారు. ఆ స‌మ‌యంలోనూ కేవ‌లం ఏడుగురు ఐపీఎస్ అధికారుల‌ను మాత్ర‌మే తెలంగాణ‌కు కేటాయించార‌ని తెలిపారు.

 

✅ దేశంతో పాటు తెలంగాణ రాష్ట్రం సైబ‌ర్ నేరాలు, డ్ర‌గ్స్, వైట్ కాల‌ర్ నేరాలు స‌హా ఇత‌ర అనేక ఆధునిక స‌వాళ్ల‌ను ఎదుర్కొంటోంద‌ని చెప్పారు. హైద‌రాబాద్‌, సైబ‌రాబాద్‌, మ‌ల్కాజిగిరి క‌మిష‌న‌రేట్ల పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌, ఫ్యూచ‌ర్ సిటీ క‌మిష‌న‌ర్, హైద‌రాబాద్ న‌గ‌రంలో భారీగా పెరుగుతున్న జ‌నాభా నేప‌థ్యంలో పెద్ద సంఖ్య‌లో ఐపీఎస్ అధికారుల అవ‌స‌రం ఉంద‌ని వివరించారు.

 

✅ మూడో క్యాడ‌ర్ రివ్యూను నిర్దేశిత 2026 సంవ‌త్స‌రంలోనే చేప‌ట్టాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ప్ర‌స్తుతం 83 ఐపీఎస్ అధికారులు రాష్ట్రంలో ఉన్నార‌ని, ఆ సంఖ్య‌ను 103కు పెంచి కేటాయించాల‌ని కోరారు. 

 

✅ ఈ భేటీ సందర్భంగా మావోయిస్టుల లొంగుబాటుపై అమిత్ షా గారితో చ‌ర్చించారు. ఇటీవ‌ల మావోయిస్టు అగ్ర నాయ‌కుల లొంగుబాటు, వారి పున‌రావాసం అంశాలు చర్చించారు. గత రెండేళ్ల‌లో తెలంగాణ పోలీసింగ్‌లో గ‌ణ‌నీయ‌మైన మార్పులు వ‌చ్చాయ‌ని ముఖ్యమంత్రి గారు తెలిపారు. 

 

✅ రాష్ట్రంలో 591 మంది మావోయిస్టులు ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలో కలిసిన విషయాన్ని చెప్పారు. ఇటీవల కాలంలో పలువురు మావోయిస్టు అగ్రనేతలు కూడా సాధారణ జీవితం గడిపేందుకు ముందుకు వ‌చ్చార‌ని, వారికి నిబంధ‌న‌ల ప్ర‌కారం అంద‌జేస్తున్న ప‌రిహారం, పున‌రావాసం విష‌యాల‌ను కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి గారు వివరించారు.

 

✅ రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు కేంద్ర ప్ర‌భుత్వం నిధులు కేటాయించి స‌హ‌క‌రించాల‌ని కూడా కోరారు. స‌మావేశంలో ముఖ్య‌మంత్రి ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ వి.శేషాద్రి గారు, రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి గారు, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీపీ విజయ్ కుమార్ గారు, ఎస్‌ఐబి ఐజీపీ బి. సుమతి గారు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Karnataka
Controvertial Charter Presented by Muslim Bodies
A major political storm has erupted in Bengaluru following a massive convention organized by the...
By Dunna Jessicaruth 2026-05-18 07:01:32 0 75
Andhra Pradesh
ప్రజా సమస్యలు పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యం ప్రజాదర్బార్ కార్యక్రమంలో మంత్రి మండిపల్లి
మంగళవారం రోజు ఉదయం మండలంలోని బో రెడ్డి గారి పల్లెలో మంత్రిగారి స్వగృహం నందు జిల్లా నలుమూలల నుండి...
By Benguluri Madhubabu 2026-03-03 08:10:50 0 217
Andhra Pradesh
నాలుగో రోజుకు చేరిన అంగన్‌వాడీల రిలే నిరాహార దీక్షలు.
మదనపల్లెలో అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో తమ న్యాయమైన డిమాండ్లను...
By Pagadala Venkateswar 2026-02-27 04:09:21 0 136
Telangana
ఆదివాసుల కల్ప వృక్షం ఇప్ప చెట్టు
n  నాటు సారా నుంచి సూపర్ ఫుడ్ వరకు… ఇప్పపువ్వు n  గిరిజన విద్యార్థినులకు శక్తి...
By Bheeshman King 2026-04-11 05:06:26 0 2K
Andhra Pradesh
పుంగనూరు: మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న కూటమి ప్రభుత్వం
కూటమి ప్రభుత్వం మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా...
By Kothuru Murali 2026-06-03 15:07:34 0 79
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com