Nara Lokesh: మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న మంత్రి లోకేశ్ దంప‌తులు.

0
159

స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించిన లోకేశ్‌

శ్రీవారి కల్యాణ మహోత్సవాన్ని తిలకించి ప్రత్యేక ఆశీస్సులు పొందిన మంత్రి దంపతులు

ఘనంగా స్వాగతం పలికిన ఆలయ అధికారులు, స్థానిక నాయకులు

మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్‌, ఆయన అర్ధాంగి బ్రహ్మణి పాల్గొన్నారు. సోమవారం అర్ధరాత్రి 12 గంటలకు నిర్వహించిన శ్రీవారి కల్యాణ మహోత్సవంలో పాల్గొని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

 

వార్షిక బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన శ్రీవారి కల్యాణాన్ని పురస్కరించుకుని ఆలయానికి చేరుకున్న లోకేశ్‌, బ్రహ్మణి దంపతులకు దేవస్థానం అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు, స్థానిక నాయకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ జరిగిన స్వామివారి కల్యాణాన్ని వారు భక్తిశ్రద్ధలతో తిలకించారు. కార్యక్రమం ముగిశాక వేద పండితులు మంత్రి దంపతులకు ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు. ఈ పవిత్రమైన కల్యాణ మహోత్సవాన్ని వీక్షించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో మంగళగిరి క్షేత్రంలో పండుగ వాతావరణం నెలకొంది.

Search
Categories
Read More
Andhra Pradesh
చీరాల అన్నా క్యాంటీన్‌కు రెండవ స్థానం – ప్రతిష్ఠాత్మక విజయం
చీరాల: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న అన్నా క్యాంటీన్ పథకం ద్వారా...
By Gadiyapudi Narendra 2026-02-18 16:37:52 0 199
Health & Fitness
COVID-19 Cases Rising in Asia: What’s Causing the Surge and What Should We Do? Doctors Explain New Symptoms
COVID-19 Cases Rising in Asia: What’s Causing the Surge and What Should We Do? Doctors...
By BMA ADMIN 2025-05-21 09:57:11 0 2K
Telangana
అభివృద్ధి పనులు చేసేది కేంద్రం. మా ప్రభుత్వమే చేస్తుందని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.
 నడిచే సిసి రోడ్డు, పారే కాలువ, పెరిగే మొక్కలు, తినే బియ్యం మా ప్రభుత్వ పథకాలే అని,...
By Sidhu Maroju 2025-06-09 13:06:28 0 1K
Andhra Pradesh
Ramasamudram: రుమలరెడ్డిపల్లిలో జరిగిన ఎస్‌ఐఆర్ (SIR) ఓటరు సవరణ కార్యక్రమంలో మైనార్టీ అధ్యక్షుడు సర్దార్ బాషా పాల్గొని ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
రామసముద్రం: అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం తిరుమలరెడ్డిపల్లి గ్రామంలో నిర్వహించిన ఎస్‌ఐఆర్...
By Pagadala Venkateswar 2026-07-15 05:16:18 0 51
Andhra Pradesh
పుంగనూరు: పుంగనూరు పట్టణంలో కోనేటి వద్ద వెలిసిన కల్పవృక్ష వాహనంపై దర్శనం ఇచ్చిన రాజమన్నార్
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో టీటీడీ ఆధ్వర్యంలో కళ్యాణ వేంకటరమణ స్వామివారి వార్షిక...
By Kothuru Murali 2026-02-27 11:04:07 0 129
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com