అభివృద్ధి పనులు చేసేది కేంద్రం. మా ప్రభుత్వమే చేస్తుందని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.

0
1K

 నడిచే సిసి రోడ్డు, పారే కాలువ, పెరిగే మొక్కలు, తినే బియ్యం మా ప్రభుత్వ పథకాలే అని, కాంగ్రెస్ చెప్పుకోవడాలు మాత్రమే, నిధులు మాత్రం కేంద్ర ప్రభుత్వానివే అని మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్ అన్నారు. సోమవారం అల్వాల్ పట్టణ పరిధిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో బిజెపి కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలపై మీడియా సమావేశం నిర్వహించారు. ప్రధానంగా రోడ్లు, రైల్వే గేట్ల వద్ద ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటి నివారణకు రైల్వే ట్రాక్ ల వద్ద ఆర్యూబీలు, ఆర్ఓబీలు, జాతీయ రహదారులు, ఫ్లై ఓవర్ బ్రిడ్జిలు కేంద్ర ప్రభుత్వ నిధులతో మంజూరైన అభివృద్ధి పనులు అని ఆయన తెలిపారు. మచ్చ బొల్లారం డివిజన్ పరిధి తురకపల్లి, బొల్లారం రైల్వే గేటు వద్ద, జనప్రియ హోమ్స్ వద్ద ప్రజల ఇబ్బందులను గుర్తించి ఆర్ యు బి నిర్మాణాల కోసం పార్లమెంట్ లో కొట్లాడి నిధులు మంజూరు చేయించడం జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు చేయడం జరిగిందని చెప్పుకోవడమే తప్ప నిధులు మాత్రం కేంద్ర ప్రభుత్వానివేనని పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో, మేడ్చల్ జిల్లాలో వేలకోట్ల వ్యయంతో నిధులు మంజూరు చేయించి రైల్వే స్టేషన్ లు, రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, రైల్వే అండర్ బ్రిడ్జిల నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందన్నారు. కెసిఆర్ గానీ రాష్ట్ర ప్రభుత్వాల నాయకులు గానీ మేము చేశాం అని చెప్తారు కానీ, ప్రజల సొమ్ము ప్రజలకు ఖర్చు పెడుతున్నామని ఒక్కరు చెప్పడం లేదన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం నేను సేవకున్ని, మీ సేవ చేస్తున్నానని చెప్తున్నారు కానీ, నేనే చేశానని ఎక్కడ చెప్పిన సందర్భాలు లేవని ఆయన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా నాయకులు మల్లారెడ్డి, చింతల మాణిక్య రెడ్డి, మల్లికార్జున్ గౌడ్, మహిపాల్ రెడ్డి, గోపు రమణారెడ్డి, దండుగుల వెంకటేష్, శ్రీకాంత్ గౌడ్, అజయ్ రెడ్డి, మోయి సుజాత, కరుణశ్రీ, పద్మిని, సుజాత, తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
జూబ్లీహిల్స్ పార్క్ పనులపై సీఎం ఆకస్మిక పరిశీలన |
హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45లో నిర్మాణంలో ఉన్న జీహెచ్ఎంసీ ‘పెట్ అండ్ ప్లే...
By Akhil Midde 2025-10-24 11:30:02 0 45
Andhra Pradesh
కర్నూలు జిల్లా నాగలాపురం పోలీస్ స్టేషన్ పెద్దపాడు సమీపంలో ఫిట్స్ తో గుర్తు తెలియని వ్యక్తి మృతి
నాగలాపురం పోలీస్ స్టేషన్ పెద్దపాడు సమీపంలో ఫిట్స్ తో గుర్తు తెలియని వ్యక్తి మృతి పెదపాడు దగ్గర...
By mahaboob basha 2025-06-09 05:19:41 0 2K
BMA
Bharat Media Awards – Honouring the Courage Behind the Camera & the Pen
Every year, we pause. Not to look back in regret but to celebrate resilience, passion, and the...
By BMA (Bharat Media Association) 2025-06-28 11:43:25 0 2K
Bihar
Prashant Kishor Challenges Rahul Gandhi to Spend a Night in Bihar Village
Patna: Jan Suraaj leader Prashant Kishor has targeted Congress MP Rahul Gandhi, challenging him...
By Bharat Aawaz 2025-06-27 09:54:45 0 1K
Telangana
కానిస్టేబుల్ కుటుంబానికి డీజీపీ పరామర్శ.. ప్రభుత్వ సహాయం |
నిజామాబాద్‌లో డీజీపీ శివధర్ రెడ్డి పర్యటన మానవీయతకు నిదర్శనంగా నిలిచింది. ఇటీవల గాయపడ్డ...
By Bhuvaneswari Shanaga 2025-10-21 11:50:24 0 36
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com