Nara Lokesh: మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న మంత్రి లోకేశ్ దంప‌తులు.

0
96

స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించిన లోకేశ్‌

శ్రీవారి కల్యాణ మహోత్సవాన్ని తిలకించి ప్రత్యేక ఆశీస్సులు పొందిన మంత్రి దంపతులు

ఘనంగా స్వాగతం పలికిన ఆలయ అధికారులు, స్థానిక నాయకులు

మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్‌, ఆయన అర్ధాంగి బ్రహ్మణి పాల్గొన్నారు. సోమవారం అర్ధరాత్రి 12 గంటలకు నిర్వహించిన శ్రీవారి కల్యాణ మహోత్సవంలో పాల్గొని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

 

వార్షిక బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన శ్రీవారి కల్యాణాన్ని పురస్కరించుకుని ఆలయానికి చేరుకున్న లోకేశ్‌, బ్రహ్మణి దంపతులకు దేవస్థానం అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు, స్థానిక నాయకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ జరిగిన స్వామివారి కల్యాణాన్ని వారు భక్తిశ్రద్ధలతో తిలకించారు. కార్యక్రమం ముగిశాక వేద పండితులు మంత్రి దంపతులకు ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు. ఈ పవిత్రమైన కల్యాణ మహోత్సవాన్ని వీక్షించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో మంగళగిరి క్షేత్రంలో పండుగ వాతావరణం నెలకొంది.

Search
Categories
Read More
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ లో 50 మంది MLA ల పెంపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్...
ఆంధ్రప్రదేశ్ లో 50 మంది MLA ల పెంపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్... ఆంధ్రప్రదేశ్: AP లో...
By Gadiyapudi Narendra 2026-01-04 10:38:03 0 190
Andhra Pradesh
గూడూరు పాక్స్ ప్రెసిడెంట్ బి దానమయ్య జాతీయ పతాకమును ఆవిష్కరీఛాడమైనది
79 వ ఇండిపెండెన్స్ డే సందర్బంగా ఈ రోజు గూడూరు పాక్స్ నందు జాతీయ పతకం ను గూడూరు పాక్స్ ప్రెసిడెంట్...
By mahaboob basha 2025-08-16 01:10:48 0 587
Meghalaya
Meghalaya Teachers Association Honors Outstanding Students
  The All Meghalaya Upper Primary and Secondary Deficit Pattern School Teachers'...
By Pooja Patil 2025-09-12 06:58:59 0 202
Andhra Pradesh
మదనపల్లె: సెక్యూరిటీ గార్డ్‌కు ఉత్తమ సేవా పురస్కారం.
మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న రామాంజులు, తన విధి నిర్వహణలో...
By Pagadala Venkateswar 2026-03-12 06:33:40 0 119
Andhra Pradesh
మదనపల్లెలో అనుమానాస్పద మృతి.. దర్యాప్తు ప్రారంభం.
మదనపల్లె పట్టణంలో సోమవారం అన్సర్ (65) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బొంబూవీధికి...
By Pagadala Venkateswar 2026-03-24 03:33:00 0 87
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com