Nara Lokesh: మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న మంత్రి లోకేశ్ దంప‌తులు.

0
158

స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించిన లోకేశ్‌

శ్రీవారి కల్యాణ మహోత్సవాన్ని తిలకించి ప్రత్యేక ఆశీస్సులు పొందిన మంత్రి దంపతులు

ఘనంగా స్వాగతం పలికిన ఆలయ అధికారులు, స్థానిక నాయకులు

మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్‌, ఆయన అర్ధాంగి బ్రహ్మణి పాల్గొన్నారు. సోమవారం అర్ధరాత్రి 12 గంటలకు నిర్వహించిన శ్రీవారి కల్యాణ మహోత్సవంలో పాల్గొని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

 

వార్షిక బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన శ్రీవారి కల్యాణాన్ని పురస్కరించుకుని ఆలయానికి చేరుకున్న లోకేశ్‌, బ్రహ్మణి దంపతులకు దేవస్థానం అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు, స్థానిక నాయకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ జరిగిన స్వామివారి కల్యాణాన్ని వారు భక్తిశ్రద్ధలతో తిలకించారు. కార్యక్రమం ముగిశాక వేద పండితులు మంత్రి దంపతులకు ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు. ఈ పవిత్రమైన కల్యాణ మహోత్సవాన్ని వీక్షించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో మంగళగిరి క్షేత్రంలో పండుగ వాతావరణం నెలకొంది.

Search
Categories
Read More
Telangana
‎సిటీ శివారు ప్రాంతల్లో నీటి ట్యాంకర్లు కు బలే గిరాకి
దిండిగల్ ,ఇ సంవత్సరం మార్చి మొదటి వారంలోనే భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు,ఈ ఏండల ప్రభావం తో...
By Ponnala Srinivasrao 2026-03-07 06:13:05 0 408
Andhra Pradesh
మదనపల్లె: దివాకర్ హత్య కేసులో ముగ్గురి అరెస్ట్.
మదనపల్లెలో సంచలనం సృష్టించిన పూల దివాకర్ హత్య కేసులో ముగ్గురు నిందితులను శనివారం అరెస్ట్ చేశారు....
By Pagadala Venkateswar 2026-03-08 04:53:45 0 150
Andhra Pradesh
ఐక్యతతో బిజెపిని బలోపేతం చేద్దాం - రాష్ట్ర యువ మోర్చా కార్యదర్శి మణి కుమార్
నేడు చీరాల రోటరీ క్లబ్ లో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా...
By Vadlamudi NagaVenkat 2026-03-24 07:28:34 0 480
Tripura
Tripura to Set Up Fruit Processing Unit in Dhalai District
To uplift pineapple farmers, the Tripura government plans to establish a fruit-processing...
By Bharat Aawaz 2025-07-17 07:49:55 0 1K
Andhra Pradesh
ఎమ్మిగనూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి సందర్శించాడు
ఈరోజు గంజహళ్లి గ్రామాన్ని సందర్శించిన ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారు, వైస్సార్సీపీ నాయకులతో కలిసి...
By Boya Dasthagiri 2026-05-05 09:31:35 0 142
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com