Raghurama Krishnam Raju: సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లకు హృదయపూర్వక కృతజ్ఞతలు: రఘురామకృష్ణరాజు.

0
123

ప్రజాప్రతినిధుల క్రీడా పోటీల్లో గాయపడిన రఘురామకృష్ణరాజు

ఎడమ చేతి మణికట్టుకు శస్త్రచికిత్స

ఫోన్‌లో ఆరోగ్య పరిస్థితిని విచారించిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్

వారికి ఎక్స్ ద్వారా కృతజ్ఞతలు తెలిపిన డిప్యూటీ స్పీకర్

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు... ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తాను గాయం నుంచి కోలుకుంటున్న తరుణంలో ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు.

 

ఇటీవల ఏపీ ప్రజాప్రతినిధుల కోసం నిర్వహించిన క్రీడా పోటీల్లో భాగంగా రఘురామకృష్ణరాజు క్రికెట్ ఆడారు. ఆ సమయంలో ఆయన ఎడమ చేతి మణికట్టుకు గాయమైంది. దీంతో వైద్యులు ఆయనకు శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్.. రఘురామకృష్ణరాజుకు వ్యక్తిగతంగా ఫోన్ చేసి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని విచారించి, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

 

ఈ నేపథ్యంలో రఘురామకృష్ణరాజు స్పందిస్తూ, "నా ఎడమ చేతి మణికట్టుకు జరిగిన శస్త్రచికిత్స అనంతరం, నా ఆరోగ్య పరిస్థితిని ఫోన్ ద్వారా వ్యక్తిగతంగా విచారించి, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు" అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు. పలువురు ఇతర నేతలు, అభిమానులు కూడా ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు

Search
Categories
Read More
Bharat
PM Narendra Modi has embarked on a 5-nation visit to Ghana, Trinidad & Tobago (T&T), Argentina, Brazil and Namibia.
Ghana, the first leg of the visit, will be PM’s first ever bilateral visit to Ghana &...
By Bharat Aawaz 2025-07-02 17:45:37 0 2K
Andhra Pradesh
వి ఆర్ ఏ లకు పదోన్నతులు ఇవ్వా లి
ఈరోజు 11 గంటలకు విశాఖ ఉమ్మడి జిల్లా గ్రామ సేవకులు (విఆర్ ఏ) సంఘం ప్రతినిధులు జిల్లా సమన్వయ కర్త...
By Mobbu Venkatramana 2026-02-07 08:30:54 0 369
Telangana
బీభత్సం సృష్టించిన డీసీఎం- కానిస్టేబుల్ దుర్మరణం.!
హైదరాబాద్ :  రాజేంద్రనగర్ – ఉప్పరపల్లి పిల్లర్ నెంబర్ 191 స్కోడా షోరూమ్ ముందు రోడ్డు...
By Sidhu Maroju 2025-12-23 11:47:49 0 182
Andhra Pradesh
పుంగనూరు: కలెక్టర్ ను కలిసిన జర్నలిస్టు సంఘ సభ్యులు
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ను ఆయన కార్యాలయంలో శనివారం ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీబీజేఏ...
By Kothuru Murali 2026-05-03 16:26:25 0 52
Andhra Pradesh
టీటీడీలో కొలువులు... ఇంజనీరింగ్ పోస్టుల పరీక్షల షెడ్యూల్ విడుదల.
టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో ఉద్యోగాల భర్తీకి ప్రకటన మే 10, 11 తేదీలలో ఆన్‌లైన్ పద్ధతిలో...
By Pagadala Venkateswar 2026-04-25 05:02:15 0 58
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com