Raghurama Krishnam Raju: సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లకు హృదయపూర్వక కృతజ్ఞతలు: రఘురామకృష్ణరాజు.

0
176

ప్రజాప్రతినిధుల క్రీడా పోటీల్లో గాయపడిన రఘురామకృష్ణరాజు

ఎడమ చేతి మణికట్టుకు శస్త్రచికిత్స

ఫోన్‌లో ఆరోగ్య పరిస్థితిని విచారించిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్

వారికి ఎక్స్ ద్వారా కృతజ్ఞతలు తెలిపిన డిప్యూటీ స్పీకర్

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు... ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తాను గాయం నుంచి కోలుకుంటున్న తరుణంలో ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు.

 

ఇటీవల ఏపీ ప్రజాప్రతినిధుల కోసం నిర్వహించిన క్రీడా పోటీల్లో భాగంగా రఘురామకృష్ణరాజు క్రికెట్ ఆడారు. ఆ సమయంలో ఆయన ఎడమ చేతి మణికట్టుకు గాయమైంది. దీంతో వైద్యులు ఆయనకు శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్.. రఘురామకృష్ణరాజుకు వ్యక్తిగతంగా ఫోన్ చేసి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని విచారించి, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

 

ఈ నేపథ్యంలో రఘురామకృష్ణరాజు స్పందిస్తూ, "నా ఎడమ చేతి మణికట్టుకు జరిగిన శస్త్రచికిత్స అనంతరం, నా ఆరోగ్య పరిస్థితిని ఫోన్ ద్వారా వ్యక్తిగతంగా విచారించి, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు" అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు. పలువురు ఇతర నేతలు, అభిమానులు కూడా ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు

Search
Categories
Read More
Telangana
ఘనంగా అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  దుండిగల్  అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం పురస్కరించుకొని...
By Sidhu Maroju 2025-11-28 05:58:19 0 200
SURAKSHA
విజయవాడ వరద సమయంలో ఏపీ పోలీసుల సహాయక చర్యల వివరాలు:
. విజయవాడ వరదల్లో ఏపీ పోలీసులు బోట్ల సహాయంతో 500 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు....
By Kalaga Sailaja 2026-07-01 05:44:51 0 37
Andhra Pradesh
ఆదోని స్టూడెంట్ యూనియన్ నాయకులు
ఆదోని జిల్లాగా ప్రకటించాలని అడిగితే సీఎం చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడ అడ్డుకుంటామనే ఉద్దేశంతో...
By Boya Dasthagiri 2026-06-24 07:35:13 0 126
Telangana
రాబోయే 3 రోజులు తీవ్ర ఎండలు
రాబోయే 3 రోజులు తీవ్ర ఎండలు తెలంగాణ : రాష్ట్రంలో ఓ వైపు ఎండలు మండిపోతుండగా మరికొన్ని చోట్ల...
By Pinnehasan Odela 2026-04-09 14:38:46 0 210
Andhra Pradesh
ప్రైవేట్ ఆసుపత్రుల బకాయిల కోసం రూ. 919 కోట్లు విడుదల చేశాం: సత్యకుమార్.
  ప్రైవేట్ ఆసుపత్రుల బకాయిల కోసం రూ. 919 కోట్లు విడుదల చేశాం: సత్యకుమార్  Andhra AP...
By Pagadala Venkateswar 2026-05-20 03:46:25 0 84
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com