బాణాసంచా ప్రమాదంలో క్షతగాత్రులను పరామర్శించిన కందుల దుర్గేష్

0
1K

కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో జరిగిన బాణాసంచా తయారీ కేంద్ర పేలుడు ఘటనలో గాయపడి, కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పరామర్శించారు.

ఆసుపత్రికి చేరుకున్న మంత్రి, బాధితుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి క్షతగాత్రికి అవసరమైన అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని, మందులు మరియు చికిత్సలో ఎలాంటి కొరత ఉండకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

బాధితులతో స్వయంగా మాట్లాడిన మంత్రి, వారికి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కుటుంబ సభ్యులను ఓదార్చారు.

ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు చికిత్స వివరాలను మంత్రికి వివరించారు. ప్రమాదంలో గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఆటో కార్మికుల సమ్మె
విశాఖ పట్నంలోని ఏ వియన్ కాలేజీ రోడ్డు అంబేద్కర్ విగ్రహ నడి కూడలిలో ఈ రోజు దేశ సమ్మె కారణంగా ఆటో...
By Mobbu Venkatramana 2026-02-12 16:18:39 0 290
Andhra Pradesh
నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి
ప్రచురణార్ధం.18.01.26   తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రివర్యులు, విశ్వ...
By Rajini Kumari 2026-01-18 13:22:19 0 142
Andhra Pradesh
గతంలో దాడికి గురి అయిన ముత్తిన రామకృష్ణని పరామర్శించిన బి సి వై పార్టీ అధ్యక్షులు రామచంద్రయాదవ్...
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి గ్రామంలో గత నెలలో కొందరు వ్యక్తులు...
By BABJI DADALA 2026-01-27 14:20:22 0 362
Telangana
యువత కోసం ఆధునిక స్నూకర్ సిండికేట్.. ఆల్వాల్‌లో ఈటెల ఘన ప్రారంభం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్  నిన్న రాత్రి ముఖ్య అతిథిగా...
By Sidhu Maroju 2026-04-04 07:56:41 0 206
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com