YS Vivekananda Reddy: వివేకా హత్య కేసులో మళ్లీ కదలిక.. రెండేళ్ల తర్వాత సీబీఐ విచారణ.

0
145

YS Vivekananda Reddy: వివేకా హత్య కేసులో మళ్లీ కదలిక.. రెండేళ్ల తర్వాత సీబీఐ విచారణ

28-02-2026 Sat 11:13 | Andhra

CBI Investigates YS Vivekananda Reddy Murder Case in Pulivendula

రెండేళ్ల తర్వాత వివేకా హత్య కేసులో మళ్లీ విచారణ

పులివెందులలో నిందితుడు సునీల్ యాదవ్ సోదరుల విచారణ

హత్య జరిగిన రోజు నాటి కాల్ డేటాపై సీబీఐ ప్రధానంగా దృష్టి

దర్యాప్తు కాలపరిమితిని సుప్రీంకోర్టు ఎత్తివేయడంతో వేగవంతమైన దర్యాప్తు

 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వై.ఎస్. వివేకానంద రెడ్డి హత్య కేసులో దాదాపు రెండేళ్ల విరామం తర్వాత మళ్లీ కదలిక వచ్చింది. సుప్రీంకోర్టు ఇటీవలి ఆదేశాల నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) తన దర్యాప్తును పునఃప్రారంభించింది. కడప జిల్లా పులివెందులలో శుక్రవారం పలువురిని విచారించి, హత్య జరిగిన రోజు నాటి కాల్ డేటాపై దృష్టి సారించింది.

 

వివరాల్లోకి వెళితే, 2019 మార్చి 15న వై.ఎస్. వివేకానంద రెడ్డి పులివెందులలోని తన నివాసంలో దారుణహత్యకు గురయ్యారు. ఈ కేసు దర్యాప్తును 2020లో సీబీఐ చేపట్టింది. అయితే, గత కొంతకాలంగా దర్యాప్తులో స్తబ్ధత నెలకొంది. ఈ క్రమంలో, దర్యాప్తు పూర్తి చేయడానికి విధించిన నెల రోజుల గడువును సుప్రీంకోర్టు ఇటీవలే తొలగించి, విచారణను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించింది. దీంతో సీబీఐ అధికారి రోహిత్ యాదవ్ నేతృత్వంలోని బృందం శుక్రవారం పులివెందులకు చేరుకుంది.

 

ఈ కేసులో నిందితుడిగా ఉన్న సునీల్ యాదవ్ సోదరులైన కిరణ్‌కుమార్ యాదవ్, మహేంద్ర యాదవ్‌లను పులివెందుల పోలీస్ స్టేషన్‌లో సుమారు రెండు గంటల పాటు విచారించారు. హత్య జరిగిన రోజు తెల్లవారుజామున 1:42 గంటలకు కిరణ్‌కుమార్ యాదవ్, అర్జున్ రెడ్డికి చేసిన వాట్సాప్ కాల్‌పై అధికారులు ప్రధానంగా ఆరా తీసినట్లు సమాచారం. నిందితుడు సునీల్ యాదవ్ కూడా తన సోదరులతో పాటు పోలీస్ స్టేషన్‌కు వచ్చారు.

 

విచారణ అనంతరం కిరణ్‌కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. "సీబీఐ దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తాను. వారు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాను. కొందరు తమను చంపడానికి ప్రయత్నిస్తున్నారని కూడా సీబీఐకి తెలిపాను" అని అన్నారు. అర్జున్ రెడ్డితో ఉన్న సంబంధంపై వ్యాఖ్యానించేందుకు ఆయన నిరాకరించారు.

Search
Categories
Read More
Telangana
శ్రీ రామా నవమి పర్వదినం సందర్భంగా భద్రాచలం మిథిలా స్టేడియంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవo
శ్రీ రామా నవమి పర్వదినం సందర్భంగా భద్రాచలం మిథిలా స్టేడియంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి...
By MERIGE MALLESH 2026-03-27 11:33:20 0 302
Tamilnadu
CPI(M) Demands CB-CID Probe into Isha Yoga Center Deaths
The Communist Party of India (Marxist) Tamil Nadu State Committee has formally called upon the...
By Lokeshwari Panthadi 2026-06-27 10:38:10 0 107
Telangana
కాంగ్రెస్ సోషల్ మీడియా నాపై తప్పుడు ప్రచారం చేస్తుంది.
 కాంగ్రెస్ సోషల్ మీడియా తన పై తప్పుడు ప్రచారం చేస్తుందని బీఆర్ఎస్ నాయకుడు రాజీవ్ సాగర్.....
By Sidhu Maroju 2025-06-13 11:43:36 0 1K
West Bengal
NCPI Rises as 20 Rebel TMC MPs Shift Bengal Allegiance
An unprecedented political shakeup has upended West Bengal following the aftermath of the state...
By Lokeshwari Panthadi 2026-06-25 12:15:22 0 50
Andhra Pradesh
Chandrababu Naidu: ఆయన బెంగళూరులో ఉంటే అదే రాజధాని అవుతుందా?: సీఎం చంద్రబాబు
      Chandrababu Naidu: ఆయన బెంగళూరులో ఉంటే అదే రాజధాని అవుతుందా?: సీఎం...
By Pagadala Venkateswar 2026-01-18 10:30:55 0 338
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com