ఆటో డ్రైవర్ నిజాయితీ- తన ఆటోలో మర్చిపోయిన విలువైన ఆభరణాలను అందజేసి ప్రశంసలు పొందాడు.|

0
123

హైదరాబాద్ : బెంగళూరులో నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ మహిళ మరిచిపోయిన మనీ పర్స్‌ను నిజాయితీగా తిరిగి అందించిన ఆటో డ్రైవర్‌కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ఫిబ్రవరి 26, 2026 తెల్లవారుజామున సుమారు ఉదయం 5.30 గంటల సమయంలో బెంగుళూరు నుంచి వచ్చిన లక్ష్మి అనే మహిళ హైదరాబాద్ లోని కాచిగూడ రైల్వే స్టేషన్ వద్ద దిగారు. అక్కడి నుంచి ఆమె దిల్సుఖ్ నగర్  లోని తన ఇంటికి వెళ్లేందుకు ఆటో రిక్షాను వినియోగించారు. ఆమెను తన ఇంటి వద్ద దింపిన తర్వాత ఆటోలో  ఆమె పర్స్ మరిచిపోయిన పర్స్  గమనించిన ఆటో డ్రైవర్ చింతల శ్రీనివాస్ ముదిరాజ్ వెంటనే తిరిగి ఆమె ఇంటికి వెళ్ళి మనీ పర్స్‌తో పాటు అందులో ఉన్న విలువైన బంగారు నెక్లేస్ మరియు మరో చైన్స్ సుమారు మూడున్నర తులాల బంగారు ఆభరణాలను  యథాతథంగా అప్పగించారు.

డ్రైవర్ నిజాయితీపై కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనను సన్మానించారు. డ్రైవర్ శ్రీనివాస్ ని శాలువాతో సన్మానించి, ₹5000 నగదుని అందచేశారు. తమ విలువైన అవధారణాలను  అందజేసిన  డ్రైవర్ శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇలాంటి నిజాయితీ గల వ్యక్తుల వల్ల ఆటో డ్రైవర్ల సమాజంపై ఉండడం వారిపై  గౌరవం మరింత పెరుగుతుందని వారు పేర్కొన్నారు. 

#sidhumaroju 

Alwal 

Search
Categories
Read More
Bharat Aawaz
"చేనేత - భారతీయ గర్వం, మన చేతిలో భవిష్యత్"
ఇది మన కథే, మన గౌరవం కూడా – చేనేతను గౌరవిద్దాం! మన దేశ గౌరవం, మన చేతిలో దాగి ఉంది. మనం...
By Pulse 2025-08-07 10:24:40 0 2K
Andhra Pradesh
ఘనంగా కవయిత్రి మొల్ల జయంతి: నివాళులర్పించిన ఇంచార్జ్ జేసి.
మదనపల్లె కలెక్టరేట్‌లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మొల్లమాంబ జయంతి...
By Pagadala Venkateswar 2026-03-13 10:39:02 0 93
Telangana
మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. తెరపైకి మరో పేరు
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో గోవాకు చెందిన డీజే క్లింటన్...
By Veeresh Kumar 2026-03-30 06:21:47 0 152
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com