Andhra Pradesh Weather: ఏపీలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు.. మార్చిలో భానుడి భగభగలు!

0
175

మార్చి తొలి వారంలోనే వేసవి తాపంపై వాతావరణ శాఖ హెచ్చరిక

దేశవ్యాప్తంగా 2 నుంచి 6.5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతల నమోదుకు అవకాశం ఉందన్న ఐఎండీ

ఏపీలో మార్చి తొలివారంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 36 డిగ్రీలు దాటే అవకాశం ఉందన్న అమరావతి వాతావరణ కేంద్రం

అనంతపురంలో గురువారం అత్యధికంగా 36.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

 

వాతావరణ మార్పుల ప్రభావంతో వేసవి కాలం రాకముందే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మార్చి మొదటి వారంలో దేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 6.5 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హెచ్చరించింది. ఈ నేపథ్యంలో మార్చి నెలలోనే ఎండలు, ఉక్కపోత తీవ్రంగా ఉండనున్నాయి. 

 

రాజస్థాన్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌తో పాటు పశ్చిమ, దక్షిణ భారతంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 34 నుంచి 37 డిగ్రీల మధ్య నమోదవుతాయని ఐఎండీ అంచనా వేసింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లోనూ మార్చి తొలి రోజుల్లోనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు 36 డిగ్రీలు దాటవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో సాధారణం కన్నా 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలు ఉన్నాయి. 

 

రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం పొడి వాతావరణం ఉంటుందని, ఉత్తర కోస్తాలో ఒకటి రెండు చోట్ల పొగమంచు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం నాటికే రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరిగింది. అనంతపురంలో అత్యధికంగా 36.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. నరసాపురం, మచిలీపట్నం, కావలి వంటి ప్రాంతాల్లో సాధారణం కంటే 2 డిగ్రీల మేర అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
చీరాలలో ఘనంగా జర్నలిస్టు ఆధ్వర్యంలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు.. ఏరియా ఆసుపత్రిలో సేవా కార్యక్రమాలు – పండ్లు, బ్రెడ్ పంపిణీ చేసిన చీరాల జర్నలిస్టులు
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా చీరాలలోని...
By Vadlamudi NagaVenkat 2026-04-14 09:43:39 0 171
Telangana
మదర్ థెరెసా జయంతి: నివాళులు అర్పించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్
సికింద్రాబాద్ జిల్లా:  కంటోన్మెంట్.     కరుణ, ప్రేమ, సేవ వంటి మానవత్వపు సహజ...
By Sidhu Maroju 2025-08-26 08:20:03 0 473
Andhra Pradesh
ప్రజా సమస్యలు పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యం ప్రజాదర్బార్ కార్యక్రమంలో మంత్రి మండిపల్లి
మంగళవారం రోజు ఉదయం మండలంలోని బో రెడ్డి గారి పల్లెలో మంత్రిగారి స్వగృహం నందు జిల్లా నలుమూలల నుండి...
By Benguluri Madhubabu 2026-03-03 08:10:50 0 216
Telangana
సికింద్రాబాద్ బచావో
సనత్ నగర్ ఎమ్మెల్యే శ్రీ శ్రీనివాస్ యాదవ్ గారి పిలుపుమేరకు సికింద్రాబాద్ బచావో కార్యక్రమంలో...
By Thodupunuri Visweswarrao 2026-01-17 06:08:31 0 478
Andhra Pradesh
పుంగనూరులో కార్యకర్తల సమీక్ష.. మహానాడుపై చర్చ
పుంగనూరు నియోజకవర్గంలో రాజంపేట పార్లమెంటు జోనల్ కోఆర్డినేటర్‌గా స్టేట్ మారిటైమ్ బోర్డ్...
By Kothuru Murali 2026-05-24 17:39:08 0 90
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com