బుద్ధునికొండ పరిరక్షణకు మార్చి 10న 'ఛలో ఢిల్లీ'

0
76

మదనపల్లె బుద్ధునికొండ పరిరక్షణకై మార్చి 10న 'ఛలో ఢిల్లీ' కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆల్ ఇండియా భిక్ఖు సంఘం ఏపీ, తెలంగాణ ప్రధాన కార్యదర్శి భంతే సద్ధారక్కిత తెలిపారు. గురువారం స్థానిక అతిథి భవనంలో ఆయన ఈ కార్యక్రమ పోస్టర్లను ఆవిష్కరించారు. చారిత్రాత్మక బుద్ధునికొండను కాపాడుకునేందుకు బౌద్ధ భిక్షువులు, ఉపాసకులు, అంబేడ్కరీయులు స్వచ్ఛందంగా తరలివచ్చి ఢిల్లీ పర్యటనను జయప్రదం చేయాలని ఆయన కోరారు. బౌద్ధ వారసత్వ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన అన్నారు.

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com